Thursday 18 September 2014

కూల్ డ్రింక్ లో మత్తమందు కలిపి అత్యాచారం

ఢిల్లీ: మహిళలపై, టీనేజ్ బాలికలపై మృగాళ్ల ఆగడాలు అంతకంతకూ శృతిమించుతూనే ఉన్నాయి.  ఢిల్లీలో ఇద్దరు యువకులు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఓ యువతి(24)పై అత్యాచారానికి పాల్పడిన ఘటన  ఆలస్యంగా వెలుగుచూసింది. మంగళవారం రాత్రి ఓ పని మీద వెళ్లిన ఆమెను ఇద్దరు యువకులు కారులో తీసుకువెళ్లి  అత్యాచారానికి పాల్పడ్డారు.  కారులో ఎక్కించుకున్న అనంతరం ఆమెను నమ్మించిన ఆ ప్రబుద్ధులు.. ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను నెహ్రూ ప్లేస్ ఫ్లై ఓవర్ క్రింద పడేశారు. అయితే ఆ అక్కడికి వచ్చిన ఆటో డ్రైవర్ సాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
' పని నిమిత్తం ఆ నిందుతుల వద్దకు వెళ్లగా, వారు నన్ను నమ్మించి కారులో చాలా దూరం తీసుకువెళ్లారు. ఆ క్రమంలోనే అప్పటికే మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. అది తాగిన నేను స్పృహ కోల్పాయాను. ఆ తరువాత నాపై అత్యాచారానికి ఒడిగట్టి నెహ్రూ ఫ్లై ఓవర్ ప్రాంతంలో పాడేసి వెళ్లిపోయారు' అని బాధితురాలు పోలీసులకు తెలిపింది.  ఆమె ఫిర్యాదు మేరకు ఆ నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువతి ప్రస్తుతం కోలుకుంటుంది.

No comments:

Post a Comment