Monday 20 October 2014

తల్లిదండ్రులను చంపేసి 72 రోజులు ఇంట్లోనే ఉంచేసిన బాలిక

murder
16 సంవత్సరాల బాలిక తన 22 సంవత్సరాల బాయ్ ఫ్రెండ్ తో కలిసి దత్తత తీసుకున్న తల్లిదండ్రులను చంపిన ఘటన వడోదరాలో చోటు చేసుకుంది.
ఇంటి నుండి చెడు వాసన రావడంతో ఇంటి చుట్టుపక్కల వారు పోలిసులకు సమాచారం అందించారు.పోలీసులు బలవంతంగా తలుపులు తెరచి చూస్తే అందులో రెండు శవాలు కనిపించాయి.
అమ్మాయి మీద అనుమానంతో పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది.హత్య చేసింది తానే అని ఒప్పుకుంది.తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ హత్య చేసినట్టు జాయింట్ పోలీస్ కమీషనర్ డీజే పాటిల్ తెలిపారు.హత్య అనంతరం ఆ బాలిక బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉంటుంది.తన బాయ్ ఫ్రెండ్ వచ్చి శవాల మీద అప్పుడప్పుడు సెంట్ చల్లి వేలుతుండేవాడు.ఈ హత్య ఆగష్టు 3న జరిగినట్టు,72 రోజుల పాటు శవాలను ఇంట్లోనే ఉంచారని పోలీసుల విచారణలో తెలిసింది.
ఎప్పుడూ తల్లిదండ్రులు కొట్టేవారని,నాకు ఇష్టం లేకున్నా చదువుకోమని బలవంతం చేసే వారని అందుకే చంపేశానని పోలీసులకు వివరించింది ఆ బాలిక.ప్రస్తుతానికి ఆ బాలిక ఒక ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి అభ్యసిస్తుంది.
పోలిసుల సమాచారం ప్రకారం వడోదరా నగరంలోని మంజల్ పూర్ ప్రాంతంలో ఉన్న తిరుపతి సొసైటీ వద్ద 63 సంవత్సరాల శ్రీహరీ వినోద్ మరియు 60 సంవత్సరాల అతని భార్య స్నేహ నివాసముంటున్నారు.వీరికి సంతానం లేకపోవడంతో 15 సంవత్సరాల క్రితం సంవత్సరం వయసున్న ఆ బాలికను దత్తత తీసుకున్నారు

No comments:

Post a Comment