దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్తులలో కొన్ని వేలంపాటకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. కొచ్చాయడన్ సినీ నిర్మాణ సంస్థకు సంబంధించిన రుణం విషయంలో పూచికత్తు ఉన్న కారణంగా ఈ పరిస్థితి తలెత్తనట్లు తెలుస్తోంది. రుణం ఇచ్చిన ఎగ్జిమ్ బ్యాంకు వేలం పాటకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే రాజీ దిశగా రజినీ కాంత్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.
అయితే ఎంతకూ డబ్బులు చెల్లించకపోవడంతో భూమిపై లవాదేవీలు తమకు తెలియకుండా జరపడానికి వీల్లేదంటూ బ్యాంకు ప్రకటన కూడా విడదల చేసింది. ఈ మేరకు తమ డబ్బులు రాబట్టుకోవడానికి వేలంపాటకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మీడియావన్ గ్లోబల్ సంస్థ రుణం తీసుకున్నది నిజమేనని, తాము మార్చిలోపు చెల్లించడానికి సిద్ధమవుతున్నట్లు వివరించారు. మరోవైపు రజినీకాంత్ కూడా బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్నట్లు వివరించారు.