Monday 22 December 2014

ఐదేళ్ల బాలికపై అత్యాచారం... ఆపై హత్య.

ముక్కు పచ్చలారని బాలిక.. ఆడుకోవడం తప్ప మరేమి తెలియ చిన్న పాప.. ఆ పాప ఆ కామాంధుల రక్కసి కోరలకు బలయ్యింది. ఆడుకుంటూ బయలకు వెళ్ళిన పాపానికి శవమై తేలింది. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన పలువురి చేత కంట తడి పెట్టించింది. వివరాలిలా ఉన్నాయి. 
 
బీహార్ లోని వైశాలి జిల్లా దామోదర్ పూర్ గ్రామంలో దేవతి దేవి కుమార్తె పూలు అమ్ముకుని నివసిస్తూ ఉంటుంది. పూలు అమ్మితే కానీ బతుకీడ్చలేని స్థితి వారిది. ఇలాంటి వారు చిన్నపిల్లలను తమతో తీసుకుపోతుంటారు. చుట్టుపక్కల ఆడుకుంటూ ఉంటే వీరు తమ వ్యాపారం చేసుకుని పది రూపాయలు సంపాదించి సంసారం సాగిస్తుంటారు. సరిగ్గా గురువారం దేవతీ దేవి కూడా తన ఐదేళ్ళ కూతుర్ని తీసుకుని పూలు అమ్ముకుంటూ ఉండిపోయింది. తన కుమార్తె అక్కడ ఇక్కడా ఆడుకుంటూ ఉండడంతో దేవి పూలమ్మడంలో మునిగిపోయింది.
 
కానీ కూతురు కనిపించకుండా పోయింది. దీంతో సారాయ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేదు. మరుసటి రోజే బాలిక శవమై ముళ్ల పొదల్లో తేలింది. తీరా అక్కడకెళ్ళి చూడగా బాలిక అత్యాచారానికి గురైనట్లు గుర్తించి విస్తుబోయారు.  గుర్తు తెలియని వ్యక్తులు బాలికపై అత్యాచారం చేసి హతమార్చారని పోలీసులు తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు

.


No comments:

Post a Comment