Friday 12 September 2014

చంద్రబాబుకు మెంటల్... చెకప్ చేయించండి: తమ్మినేని సీతారాం సలహా!

Tammineni Seetaram
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి 'మెంటల్' చెకప్ చేయించాలని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం సూచించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ నుంచి ప్రతిచోటా చంద్రబాబు నాయుడకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నామస్మరణకే సమయమంతా సరిపోతుందన్నారు. తనకు తెలిసినంత వరకు బాబుకు మతిస్థిమితం తప్పినట్టుందని వ్యాఖ్యానించారు. అందువల్ల బాబును కుటుంబ సభ్యులు ఏదైనా మంచి ఆసుపత్రిలో చేర్పించి పరీక్షలు చేయించాలని సూచించారు. 
 
తాను ఇంతకుముందు టీడీపీలో పని చేశానని, అందుకే, బాబు శ్రేయస్సు కోరి ఈ మాట చెబుతున్నానని అన్నారు. ఏపీని కాసేపు సింగపూర్ చేస్తానంటారని, కొద్దిసేపటికే మాటమార్చి, మరో ముంబై చేస్తానంటారని తమ్మినేని ఎద్దేవా చేశారు. ఇప్పటికే సింగపూర్, ముంబై ఉన్నాయని, ఇప్పుడు బాబు కొత్తగా చేసేది ఏమిటని అన్నారు. 
 
ఆర్థిక సంఘం ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన ప్రతిపాదనల్లో ఏమాత్రం పసలేదని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఆర్థిక సంఘం వద్ద తమకు ఏయే అవసరాలకు ఎంతెంత నిధులు కావాలన్న విషయాలను నిర్మాణాత్మకంగా చెప్పి నిధులు తెచ్చుకోవాలని.. అంతేకానీ గత ప్రభుత్వాల మీద బురద జల్లడానికి చూడానికి ఈ నివేదికనే ఉపయోగించుకోవడం సరికాదని తమ్మినేని సీతారాం సూచించారు. 

No comments:

Post a Comment