Tuesday 16 September 2014

గోల్కొండ దగ్గర ఉద్రిక్తం.. బీజేపీ నేతల అరెస్ట్...

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేస్తానని భారతీయ జనతాపార్టీ ప్రకటించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం గోల్కొండ కోట మీద జాతీయ జెండా ఎగురవేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. గోల్కొండ కోట మీద ఎవరూ జెండా ఎగురవేయకుండా భద్రతా ఏర్పాట్లు చేసింది. అయితే బీజేపీ నాయకులు మాత్రం అక్కడ జాతీయ జెండా ఎగురవేస్తామని స్పష్టంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విమోచన దినమైన బుధవారం నాడు బీజేపీ నాయకులు గోల్కొండ కోట దగ్గరకి చేరుకున్నారు. కోట లోపలకి వెళ్ళి అక్కడ జాతీయ జెండా ఎగురవేయడానికి ప్రయత్నించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. దాంతో గోల్కొండ ప్రాంతలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది

.

No comments:

Post a Comment