Saturday 27 December 2014

పూచీ పడిన పాపానికి...రజనీకాంత్ ఆస్తుల వేలం?

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్తులలో కొన్ని వేలంపాటకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. కొచ్చాయడన్ సినీ నిర్మాణ సంస్థకు సంబంధించిన రుణం విషయంలో పూచికత్తు ఉన్న కారణంగా ఈ పరిస్థితి తలెత్తనట్లు తెలుస్తోంది. రుణం ఇచ్చిన ఎగ్జిమ్ బ్యాంకు వేలం పాటకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే రాజీ దిశగా రజినీ కాంత్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. 
 
రజినీ కుమార్తె దర్శకత్వం వహించిన కొచ్చాడయన్ సినిమాను మీడియావన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఈ సంస్థ ఎగ్జిమ్ బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. ఈ సినమాకు దాదాపు రూ. 120 కోట్లు ఖర్చు అయ్యింది. అందులోంచి కొంత భాగం ఎగ్జిమ్ బ్యాంకు రుణంగా సమకూర్చింది. ఇందుకుగానూ రజినీ సతీమణి లతకు సంబంధించిన 2.13 ఎకరాల స్థలాన్ని పూచికత్తుగా పెట్టినట్లు తెలుస్తోంది. కొచ్చాడయన్ అంత కలెక్షన్లను రాబట్ట లేకపోయింది. దీంతో బ్యాంకు వడ్డీ అసలు లెక్కగట్టి రూ. 22.21 కోట్లు తమకు రావాల్సి ఉందని ప్రకటించింది. దీనిపై పూచికత్తుగా ఉన్న లత రజినీకాంత్ కు నోటీసులు జారీ చేశారు. ఈ యేడాది జులై17 తేది చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. 
 
అయితే ఎంతకూ డబ్బులు చెల్లించకపోవడంతో భూమిపై లవాదేవీలు తమకు తెలియకుండా జరపడానికి వీల్లేదంటూ బ్యాంకు ప్రకటన కూడా విడదల చేసింది. ఈ మేరకు తమ డబ్బులు రాబట్టుకోవడానికి వేలంపాటకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మీడియావన్ గ్లోబల్ సంస్థ రుణం తీసుకున్నది నిజమేనని, తాము మార్చిలోపు చెల్లించడానికి సిద్ధమవుతున్నట్లు వివరించారు. మరోవైపు రజినీకాంత్ కూడా బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్నట్లు వివరించారు. 

లైంగికంగా వేధించిన సన్ టీవీ సీఓఓ అరెస్టు!

sun tvసహ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించినట్టు ఆధారాలతో సహా నిరూపించడంతో సన్ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)ను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన సీఓఓ పేరు ప్రవీణ్. 
 
ఈ మేరకు బాధిత మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేసినట్టు చెన్నై నగర పోలీసులు వెల్లడించారు. గతంలో కూడా సూర్య టీవీ చెందిన ఒక మాజీ మహిళ ఉద్యోగి ఈ ఆరోపణ చేసి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఇపుడు ప్రవీణ్‌ను అన్నా నగర్‌లోని ఆయన ఇంటి వద్ద అరెస్టు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Monday 22 December 2014

ఐదేళ్ల బాలికపై అత్యాచారం... ఆపై హత్య.

ముక్కు పచ్చలారని బాలిక.. ఆడుకోవడం తప్ప మరేమి తెలియ చిన్న పాప.. ఆ పాప ఆ కామాంధుల రక్కసి కోరలకు బలయ్యింది. ఆడుకుంటూ బయలకు వెళ్ళిన పాపానికి శవమై తేలింది. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన పలువురి చేత కంట తడి పెట్టించింది. వివరాలిలా ఉన్నాయి. 
 
బీహార్ లోని వైశాలి జిల్లా దామోదర్ పూర్ గ్రామంలో దేవతి దేవి కుమార్తె పూలు అమ్ముకుని నివసిస్తూ ఉంటుంది. పూలు అమ్మితే కానీ బతుకీడ్చలేని స్థితి వారిది. ఇలాంటి వారు చిన్నపిల్లలను తమతో తీసుకుపోతుంటారు. చుట్టుపక్కల ఆడుకుంటూ ఉంటే వీరు తమ వ్యాపారం చేసుకుని పది రూపాయలు సంపాదించి సంసారం సాగిస్తుంటారు. సరిగ్గా గురువారం దేవతీ దేవి కూడా తన ఐదేళ్ళ కూతుర్ని తీసుకుని పూలు అమ్ముకుంటూ ఉండిపోయింది. తన కుమార్తె అక్కడ ఇక్కడా ఆడుకుంటూ ఉండడంతో దేవి పూలమ్మడంలో మునిగిపోయింది.
 
కానీ కూతురు కనిపించకుండా పోయింది. దీంతో సారాయ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేదు. మరుసటి రోజే బాలిక శవమై ముళ్ల పొదల్లో తేలింది. తీరా అక్కడకెళ్ళి చూడగా బాలిక అత్యాచారానికి గురైనట్లు గుర్తించి విస్తుబోయారు.  గుర్తు తెలియని వ్యక్తులు బాలికపై అత్యాచారం చేసి హతమార్చారని పోలీసులు తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు

.


Friday 12 December 2014

పెళ్లిలో గల్లాలు పట్టుకున్న విష్ణువర్ధన్‌, వంశీచందర్‌ నీది తప్పంటే నీది తప అని నిందించుకున్న నేతలు పోలీసుల స్వాధీనంలో సిసిటివి ఫుటేజి

న్యూ ఢిల్లీ, డిసెంబర్‌ 12: వారిలో ఒకరు మాజీ ఎమ్మెల్యే, మరొకరు ప్రస్తుత ఎమ్మెల్యే. వీరి పేర్లు విష్ణువర్ధన్‌ రెడ్డి, వంశీచందర్‌ రెడ్డి. విష్ణువ ర్ధన్‌ రెడ్డి సుప్రసిద్ధ కాంగ్రెస్‌ నాయకుడు పిజెఆర్‌ కుమారుడు. వంశీచందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే. వేదిక హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌. అక్కడ విష్ణు బావమరిది వివాహం జరుగుతోంది. 

అక్కడ ఆకస్మికంగా జరిగిన సంఘజన వివాహానికి వచ్చిన అందరినీ దిగ్ర్భాంతికి గురి చేసింది. ఇద్దరిమధ్యా ఏమైందో ఏమో ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. వారిది తప అంటే వారిది తప అని పరస్పరం ఆరోపించుకున్నారు. చిన్న ఘర్షణగా ప్రారంభమై చినికి చినికి గాలివానగా మారి ఇరువురూ పోలీసు స్టేషన్‌కి వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకునేవరకూ వెళ్లింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. తమ ఫిర్యాదును పోలీసులు తీసుకోవడంలేద ంటూ విష్ణు, తమ తల్లితో కలిసి ధర్నాకు దిగారు. అనంతరం పోలీసులు విష్ణు ఫిర్యాదును కూడా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనకు సంబంధించిన ఫుటేజిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, 

వంశీ అనే వ్యక్తి పిలవని పెళ్లికి వచ్చాడని విష్ణు ఆరోపించారు. జరిగిన సంఘటన గురించి విష్ణు వివరిస్తూ తాను, తమ సోదరి, తల్లి వచ్చిన అతిథులను రిసీవ్‌ చేసుకుంటున్నామని, అపడు అటు వచ్చిన ... అని మీడియాకు చెబుతూ ఆ వ్యక్తి పేరును తమ సహచరులను అడిగి వంశీ అని ఆయన చెప్పారు. వంశీ ... చందర్‌ అంట, ఎమ్మెల్యే అంట ... గొడవపడాలనుకుంటే గాంధీ భవన్‌ ఉంది, గ్రౌండ్‌కైనా సరే, మహబూబ్‌నగర్‌లోనైనా సరే అని ఆయన సవాలు విసిరారు. వంశీ మహబూబ్‌నగర్‌లో పుట్టాడని, తాను హైదరాబాద్‌లో పుట్టానని చెబుతూ తాను పిజెఆర్‌ కుమారుడినని, పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నాయని విష్ణు వ్యాఖ్యానించారు. 

అయితే విష్ణువర్ధన్‌ రెడ్డే తనపైనా, గన్‌మ్యాన్‌పైనా దాడి చేశాడని, కావాలంటే సిసిటివి ఫుటేజ్‌ చూసుకోవచ్చునని వంశీచందర్‌ రెడ్డి వివరించారు. ఇపడు ఎక్కడ ఏ నేరం జరిగినా ఎవరిది తప అన్న విషయాన్ని సిసిటివి ఫుటేజి చూసి తెలుసుకోవచ్చునని ఆయన అన్నారు. వివాహానికి వెళ్లినపడు విష్ణు ముందు మాట్లాడుతున్నట్టు మాట్లాడి వేళ్లు విరిచే ప్రయత్నం చేశాడని, తనను రక్షించడానికి ముందుకు వచ్చిన సాయుధ భద్రతా సిబ్బందిపై విష్ణు చేయిచేసుకున్నాడని ఆయన ఆరోపించారు. తాను పెళ్లి కుమార్తె తరపున వివాహానికి హాజరైనట్టు వంశీ వివరణ ఇచ్చారు. 

వీరిద్దరి మధ్య ముందు పార్కింగ్‌ వద్ద గొడవ జరిగిందని, అదే పెద్ద సమస్యగా మారినట్టు తెలుస్తున్నది. అయితే వివాహ వేదికవద్ద జరిగిన ఘర్షణ సిసిటివిలో రికార్డు అయ్యిందిగాని పార్కింగ్‌ వద్ద జరిగిన గొడవ మాత్రం రికార్డు కాలేదని తెలుస్తున్నది. అయితే పోలీసులు అన్ని కెమేరాలలో రికార్డు అయిన ఫుటేజిని స్వాధీనం చేసుకుని అసలు ఏం జరిగిందో దర్యాప్తు ప్రారంభించారు. 

తెంలగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొన్నాల ఇరువురికీ ఫోన్‌ చేసి అసలు ఏం జరిగిందీ తెలుసుకున్నారు. ఇలా బహిరంగంగా గొడవపడకూడదని ఆయన ఇద్దరికీ హితవు చెప్పినట్టు తెలుస్తున్నది.

Tuesday 2 December 2014

రోగులపై అత్యాచారం .. కేన్సర్ వైద్యుడికి 22 యేళ్ల జైలు!

తన వద్దకు వైద్యం కోసం వచ్చిన రోగులను (యువతులు) లైంగికంగా వేధించిన కేసులో కేన్సర్ వైద్య నిపుణుడికి బ్రిటన్ కోర్టు 22 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. మొత్తం 18మంది బాలికలను లైంగికంగా వేధించినట్టు కోర్టు వెల్లడించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే.. 
 
మైల్స్ బ్రాడ్‌బరీ అనే ఆ వైద్యుడు కేంబ్రిడ్జిలోని అడెన్‌బ్రూక్ ఆస్పత్రిలో రక్త కేన్సర్ నిపుణుడిగా పని చేసేవాడు. ఈయన వద్దకు వచ్చే రోగులను లైంగికంగా వేధిస్తూ.. వారిని లోబరచుకుని అత్యాచారం చేసేవాడు. ఈ విధంగా గత 2009లో 25 ఆరోపణలు వచ్చాయి. 13 ఏళ్ల వయసున్న బాలికపై కూడా అత్యాచానికి పాల్పడినట్టు సమాచారం. అత్యాచారం చేయడమే కాకుండా, తన కామకృత్యాలను వీడియోలు కూడా తీసేవాడు. 
 
దీనిపై కొందరు రోగులు ఫిర్యాదు చేయడంతో అతని లీలలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా 2013లో బ్రాడ్‌బరీని పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య సహాయం కోసం వచ్చిన 18 మంది యువతుల పట్ల మైల్స్ బ్రాడ్ అత్యంత క్రూరంగా వ్యవహరించాడని, వాళ్ళు అతడ్ని ఎంతగానో నమ్మి వస్తే వారిపట్ల అసభ్యంగా ప్రవర్థించాడని ప్రాసిక్యూషన్ న్యాయవాది మిచెల్ బ్రౌన్ అన్నారు. 
 
ఇరుతరపు వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇలాంటి కేసు ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదని చెప్పారు. అత్యంత తీవ్రమైన వ్యాధులతో బాధపడేవాళ్లను కూడా అతడు వదల్లేదని, అతడికి 22 ఏళ్ల జైలు శిక్ష విధించడం భావ్యమేనని అభిప్రాయపడ్డారు.

Sunday 30 November 2014

హ్యాపీగా శ్రీజ బర్త్‌డే ఆస్పత్రిలో పవన్‌ అభిమాని పుట్టినరోజు వేడుక ఈ వారంలో డిశ్చార్జ్‌ చేస్తాం: వైద్యులు

ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? లేకపోతే పక్కన ఉన్న ఫొటో చూడండి! ఆ.. ఆ పాపే!! మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ పవన్‌ కల్యాణ్‌ను చూడాలని తపించిన ఆ చిన్నారి శ్రీజనే ఈమె. వైద్యుల చేతి చలువ.. పవన్‌ పరామర్శ బలం.. ఫలించి కోలుకుంది. ఆస్పత్రిలోనే ఆదివారం పుట్టినరోజు జరుపుకొంది.
ఖమ్మం (చర్చి కాంపౌండ్‌), నవంబర్‌ 30: ‘ఎక్యూట్‌ డిస్సెమినేటెడ్‌ ఎన్‌సెఫలోమైలైటిస్‌’తో 3 నెలలుగా ఖమ్మంలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజ... ఆమెను చూసేందుకు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఆస్పత్రికి వెళ్లి కంటతడి పెట్టిన సంగతి గుర్తుందా? ఇప్పుడా పాప క్షేమంగా ఉంది. ఆదివారం ఆస్పత్రిలోనే 13వ పుట్టినరోజు వేడుక చేసుకుంది. అక్టోబర్‌ 2న ఆమె ప్రాణాపాయ స్థితిలో వచ్చిందని.. ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడిందని, మరికొంత కోలుకున్నాక ఈ వారంలోనే డిశ్చార్జ్‌ చేస్తామని.. శ్రీజకు వైద్యం చేస్తున్న కార్తీక్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ అసాధారణ్‌ తెలిపారు. శ్రీజ ఆరోగ్య పరిస్థితిపై అందరూ వాకబు చేస్తుండటంతో ఆస్పత్రిలోనే జన్మదిన వేడుక జరిపి, విలేకరులను పిలిచి, అందరికీ ఆమె పరిస్థితి తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శ్రీజ కూడా మాట్లాడింది. ‘నా పేరు శ్రీజ. నేను పాల్వంచ డీఏవీ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాను’ అని చెప్పింది. ఆమె తనంతట తానే నడవగలుగుతోంది. కొద్దికొద్దిగా తినగలుగుతోంది. కాగా.. శ్రీజ తల్లిదండ్రులు నాగయ్య, నాగమణి భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. హైదరాబాద్‌ ఆస్పత్రిలో 21రోజులు శ్రీజను ఐసీయూలో ఉంచినా, చేయిదాటిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారని గుర్తు చేసుకున్నారు. అయితే, కొందరి సలహా మేరకు ఖమ్మం తీ
సుకొచ్చామన్నారు. శ్రీజ కోలుకోవడం లో డాక్టర్‌ అసాధారణ్‌, సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. ఆమెను పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌కు, ఆర్థిక సహాయం చేసిన పవన్‌ అభిమానులకు, ఆమెకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, కేటీపీఎస్‌లోని తన తోటి ఉద్యోగులకు, పవన్‌ కల్యాణ్‌ రాక కోసం కృషిచేసిన ‘మేక్‌ ఎ విష్‌’ సంస్థకు, మీడియాకు.. వారు కృతజ్ఞతలు తెలిపారు.
పవన్‌ మళ్లీ వస్తాడా?
‘శ్రీజా.. నేను పవన్‌ కల్యాణ్‌ను వచ్చాను లేమ్మా’.. అక్టోబర్‌ 17న ఆమెవద్దకు వచ్చిన పవన్‌కల్యాణ్‌ పలకరించిన తీరిది! ఆ రోజు అరగంట శ్రీజ వద్దే కూర్చున్న పవన్‌ ఒకదశలో కంటతడిపెట్టడం తెలిసిందే. ఆ చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి.. శ్రీజ తప్పకుండా కోలుకుంటుందని, ఆ విషయం తెలిపితే మళ్లీ వస్తానని వారికి భరోసా ఇచ్చారు. పవన్‌కల్యాణ్‌ అంటే ప్రాణం పెట్టే శ్రీజ.. తనకోసం ఆ పవర్‌స్టారే దిగివచ్చినప్పుడు అపస్మారక స్థితిలో ఉంది. కొద్దిసేపు కళ్లు తెరిచినా అది గుర్తుందో లేదో. ఇప్పుడామె కోలుకుంది. పవన్‌ ఆమెను చూడ్డానికి మళ్లీ వెళ్తాడా? పరామర్శిస్తాడా? చిన్నారి అభిమానికి ఆనందం కలిగిస్తాడా? మాట నిలబెట్టుకుంటాడా?వేచి చూడాల్సిందే!!

సోదరితో వివాహేతర సంబంధం అంటగట్టినందుకు హత్య

విశాఖపట్నం: నిత్యం తన చెల్లెలను వేధించడంతోపాటు, ఆమెతో తనకు వివాహేతర సంబంధాన్ని అంటగట్టడాన్ని తట్టుకోలేని ఓ సోదరుడు తన బావమరిదిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా పాడేరు మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. గబ్బంగి పంచాయతీ పనసపల్లికి చెందిన పాంగి తిరుపతి రావు(40) చిన్నాన్న కుమార్తె పార్వతమ్మను జీ మాడుగుల మండలం సింగర్భకు చెందిన చిట్టిబాబు(35)కు ఇచ్చి పెళ్లి చేశారు. మూడేళ్ల క్రితం చిట్టిబాబుతో అతడి కుటుంబాన్ని పనసపల్లికి తెచ్చిన తిరుపతి రావు అతడికి కొన్ని పశువులను అప్పగించి పశువుల కాపరిగా ఉంచాడు. గత ఏడాది ఇద్దరి మధ్య మసస్పర్థలు రావడంతో తన భార్యతో తిరుపతి రావుకు వివాహేతర సంబంధం ఉందంటూ చిట్టిబాబు ప్రచారం చేయడం ప్రారంభఇంచాడు. మద్యం తాగి వచ్చి గొవడపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో పార్వతమ్మ శనివారం కూలీ పనుల కోసం వెళ్లింది. అనంతరం ఆదివారం ఉదయం ఇంటికి వచ్చింది. అప్పటికే ఇంట్లో భర్త చనిపోయి ఉండటంతో పార్వతమ్మ..సమీపంలోనే ఉన్న సోదరుడు తిరుపతి రావు ఇంటికెళ్లి వదినకు చెప్పింది. చిట్టిబాబు దుష్ప్రచారాన్ని తట్టుకోలేక అతనిని చంపేశానని చెప్పి తిరుపతి రావు గ్రామం వదిలి వెళ్లాడని ఆమె చెప్పింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. హైవేపై దొంగతనం జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొత్తకోట నుంచి వనపర్తి వెళ్ళే దారిలోని గుంపు గట్టు దగ్గర ఒక కారు పై దాడి చేశారు. కారులో ఉన్న వారిని గాయపరచి వారివద్ద ఉన్న నగదు లాక్కున్నారు. అదే దారిలో వస్తున్న ఓ అంబులెన్సు పై కూడా దాడి చేశారు. దుండగుల దాడిలో ఆరుగురు గాయపడినట్టుగా తెలుస్తోంది

కరీంనగర్‌లో పేలుడు, చెల్లాచెదురైన శరీర భాగాలు

హైదరాబాద్: కరీంనగర్‌ శివారులో ఉన్న హౌజింగ్‌బోర్డు కాలనీ ఓ ఇంట్లో ఆదివారం ఉదయం 6 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల శరీర భాగాలు మాంసం ముద్దలుగా మారాయి. ఈ పేలుడు సంఘటనలో కర్నూలు జిల్లా వెలుగోడు మండల కేంద్రానికి చెందిన పట్నం నాగార్జున కుమార్‌ (34), మ ల్లు రామకృష్ణారెడ్డి (60)లు దుర్మరణం చెందగా పట్నం శ్రీనివాస్‌కుమార్‌ (26)కు తీవ్రగా యా లతో పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరబాద్‌కు తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం పట్నం నాగార్జున కుమార్‌, శ్రీనివాస్‌ కుమార్‌ సోదరులు 12 సంవత్సరాల నుంచి కరీంనగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో దేవతలు, ఇతర బొమ్మలు తయారు చేసి విక్రయిస్తుంటారు. వీరి వద్ద వంట మనిషిగా అదే గ్రామానికి చెందిన మల్లు రామకృష్ణారెడ్డి పని చేస్తున్నాడు. ఇంట్లోని రెండు గదులను గోదాంగా చేసి అక్కడే బొమ్మల తయారీకి ఉపయోగించే రసాయనాలు నిల్వ ఉంచుతారు. అయితే శనివారం మద్యాహ్నం వీరు నివాసముంటున్న ఇంటి ఆవరణలో పేలుడు జరిగింది. గడువు ముగిసిన హార్డినరీ రసాయనంపై ఒత్తిడి కారణంగానే అది పేలిందని పోలీసులు భావిస్తున్నారు. 

ఇక పోస్టాఫీసుల్లోనూ శ్రీవారి దర్శన టికెట్లు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్ల బుకింగ్‌ను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 5 జిల్లాల్లో 9 తపాలా కార్యాలయాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి.
 
చిత్తూరు జిల్లా మదనపల్లె తపాలా కార్యాలయం, అక్కడి బజారు వీధిలోని సబ్ పోస్ట్ ఆఫీసులోను, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని, వరంగల్ జిల్లాలోని జనగాం పోస్టాఫీస్, నర్సంపేట సబ్ ఆఫీస్, కృష్ణాజిల్లాలో గుడివాడ, నందిగామ హెడ్ పోస్టాఫీసుల్లో ఆన్‌లైన్ బుకింగ్ ఆరంభిస్తారు.
 
ఇవి ప్రతి రోజూ టికెట్లను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జారీ చేస్తారని తిరుపతి తపాలా డివిజన్ సూపరింటెండెంట్ టీఏవీ.శర్మ తెలిపారు

మరోసారి తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ముంబై, నవంబర్‌ 30 : వాహనదారులకు శుభవార్త... పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి తగ్గాయి. పెట్రోలు లీటరుపై 91 పైసలు, డీజిల్‌పై 84 పైసలు తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌, విశాఖపట్టణంలో లీటరు పెట్రోల్‌ ధర రూ. 70 లు కన్నా దిగువకు రానునంది. లీటరు డీజిల్‌ ధర స్థానిక పన్నులతో కలిసి రూ. 57 రూపాయలకు చేరనుంది. తగ్గిన పెట్రో ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధర 70 డాలర్లకన్నా తక్కువకు పడిపోవడంతో ఈ మేరకు ధరలు తగ్గాయి. పెట్రోలు ఎగుమతి దేశాలు సైయితం ఉత్పత్తిని తగ్గించబోమని ప్రకటించాయి

ఈవ్‌ టీజర్‌ భరతం పట్టిన ఇద్దరు అమ్మాయిలు


హర్యానా, నవంబర్‌ 30 : బస్సులో ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడిన పోకిరిని ఇద్దరు అమ్మాయిలు బెల్ట్‌ తీసి చితక్కొట్టారు. ఈ ఘటన హర్యానాలోని రోహ్‌తక్‌లో జరిగింది. బస్సులో అంతమంది ప్రయాణీకులు ఉన్నా ఎవరూ వీరికి సాయం రాలేదు. ఆ ఇద్దరు అమ్యాయిలే ధైర్యంగా పోకిరీని ఎదుర్కొన్నారు. దాంతో ఆగకుండా ఆ పోకిరిని పోలీసులకు అప్పగించారు

Friday 28 November 2014

బతికుండగానే పవన్ కళ్యాణ్ విగ్రహం

ఈ అభిమానులనేవాళ్ళున్నారే.. ఒక్కోసారి వాళ్ళేం చేస్తారో వాళ్ళకే తెలియదు. సాధారణంగా ఎవరైనా పోయాక విగ్రహాలు పెడతారు. అభిమానం ముదిరిపోయిన అభిమానులు తాము అభిమానించే వారికి బతికుండగానే విగ్రహాలు పెట్టేస్తారు. మొన్నామధ్య ఉత్తరప్రదేశ్‌లో మాయవతి విగ్రహాలు అలాగే పెట్టారు. అలాగే తెలంగాణ దేవత సోనియాకి గుడి కట్టించి, అందులో ఆమె విగ్రహాన్ని కూడా మాజీ మంత్రి శంకర్రావు ఇటీవల పెట్టించారు. ఇప్పుడు బతికుండగానే విగ్రహాలు పెట్టించుకునే లిస్టులోకి పవన్ కళ్యాణ్ కూడా చేరబోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో పవన్‌కళ్యాణ్ విగ్రహం ఏర్పాటుచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికోసం పెనుమంట్ర మండలంలోని నత్తారామేశ్వరంలో విగ్రహం కూడా తయారైపోతోంది. కొంతమంది జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆర్డర్ ఇచ్చిన మీదట ఈ గ్రామానికి చెందిన శిల్పి అరుణప్రసాద్ వడయార్ పవన్ కళ్యాణ్ నిలువెత్తు విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. దీనిమీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.



శ్వేతాబసు ప్రసాద్.. మళ్ళీ నటన

సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ తిరిగి తన నట జీవితాన్ని ప్రారంభించారు. చాలాకాలం తర్వాత ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందు నటించబోతోంది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు హన్సల్ మెహతా రూపొందిస్తున్న ఒక డాక్యుమెంటరీలో శ్వేతాబసు ఇప్పుడు నటించబోతోంది. ఒక స్టార్ హోటల్లో అభ్యంతరకర పరిస్థితుల్లో పట్టుకున్నామంటూ పోలీసులు ఆమెను కోర్టు ఆదేశాలతో హైదరాబాద్‌లోని రెస్క్యూ హోమ్‌కి పంపిన విషయం తెలిసిందే. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, పోలీసులు తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని శ్వేతాబసు ప్రసాద్ చెబుతోంది. నిజానిజాలు ఎలా వున్నప్పటికీ శ్వేతాబసు ప్రసాద్ మళ్ళీ తన నట జీవితాన్ని కొనసాగించడం అభినందనీయమైన విషయం. శ్వేతా బసు ప్రసాద్ ప్రస్తుతం నటిస్తున్న డాక్యుమెంటరీలో ఆమె చాలా కీలకమైన పాత్ర ధరిస్తున్నట్టు తెలుస్తోంది. చిన్నతనంలోనే నటిగా జాతీయ అవార్డును పొందిన శ్వేతా బసు ప్రసాద్ ఈ డాక్యుమెంటరీలో కూడా జాతీయ స్థాయి అవార్డు పొందేంత మంచి పాత్రను ధరిస్తున్నట్టు సమాచారం. ఈ డాక్యుమెంటరీ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది.

ఉదయ్‌కిరణ్‌ హత్య దారుణం..

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సమీపంలోని బాటసింగారం‌లో అదృశ్యమైన ఏడో తరగతి విద్యార్థి ఉదయ్‌కిరణ్ హత్యకి గురయ్యాడు. గురువారం ఉదయం స్కూలుకు వెళ్ళిన ఉదయ్‌కిరణ్ గురువారం సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చింతలకుంట చెరువులో ఉదయ్‌కిరణ్ మృతదేహం కనిపించింది. ఉదయ్ కిరణ్‌ని హత్య చేసిన వారు శవాన్ని నీటిలో వేశారు. శవం పైకి తేలకుండా ఉండటానికి మృతదేహం మీద పెద్ద బండరాయిని పెట్టారు. పోలీసుల దర్యాప్తులో ఉదయ్ కిరణ్‌ని అతని పెదనాన్న కుమారుడు నవీన్ హత్య చేసినట్టు కనుగొన్నారు. నవీన్ శుక్రవారం ఉదయం పోలీసులకు లొంగిపోయాడు. పెద్దల మధ్య వున్న ఆస్తి గొడవల కారణంగానే నవీన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఉదయ్ తల్లిదండ్రులకు చాలాకాలానికి కలిగిన కుమారుడు. అది కూడా సరోగసీ పద్ధతి ద్వారా జన్మించాడు. ఉదయ్ కిరణ్‌ని చంపిన నవీన్ గత కొంతకాలంగా ఏ పనీలేక జులాయిగా తిరుగుతున్నాడు. గతంలో హోంగార్డు ఉద్యోగాన్ని సంపాదించాడు. నకిలీ ధ్రువపత్రాలతో హోంగార్డు ఉద్యోగం పొందిన అతనిని విధుల నుంచి తప్పించారు. ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Wednesday 26 November 2014

వ్యభిచరిస్తూ దొరికిపోయిన నటి

ఈమధ్యకాలంలో టెలివిజన్ సీరియళ్ళలో నటిస్తున్న నటీమణులు ‘అలాంటి’ పరిస్థితుల్లో దొరికిపోవడం మామూలైపోయింది. హైదరాబాద్‌ నగరంలోని మోతీనగర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఒక అపార్ట్‌మెంట్‌లో ఉండకూడని విధంగా ఇద్దరు యువకులతో కలసి వున్న టెలివిజన్ నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వేళలో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా సదరు టీవీ నటీమణి దొరికిపోయింది. ఆమెతోపాటు ఆమెతో వున్న మరో ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన నటి ఒక ప్రముఖ తెలుగు సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

భార్యతో ఏకాంతానికి అడ్డని ఆరాధ్యని చంపేశాడు

ఒంగోలులో మంగళవారం నాడు ఏడాదిన్నర వయసున్న ఆరాధ్య అనే బాలిక కిడ్నాపైన విషయం తెలిసిందే. ఒంగోలులోని రాజా పానగల్‌రోడ్డులో నివసించే శ్రీధర్, సాహితి దంపతులు తమ కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జరిపిన పరిశోధనలో ఆరాధ్యను ఆమె బాబాయే హత్య చేశాడని వెల్లడయింది. ఆరాధ్య పిన్ని సింధు అనే యువతిని లక్ష్మీనారాయణ అనే యువకుడు మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. ఆరాధ్య ఎప్పుడూ తన పిన్నిని విడిచిపెట్టకుండా ఆమె దగ్గరే వుండేది. దాంతో తన భార్యతో గడపడానికి ఆరాధ్య ఎప్పుడూ అడ్డుగా వుంటోందన్న కోపంతో లక్ష్మీనారాయణ ఆరాధ్యని కిడ్నాప్ చేశాడు. మంగళవారం ఇంటి బయట ఆడుకుంటున్న ఆరాధ్యని బైక్ ఎక్కించుకుని ఊరిచివర్లో ఉన్న పంటచేల దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆరాధ్యని గొంతు పిసికి దారుణంగా హత్యచేశాడు. ఆ తర్వాత ఆరాధ్య మీద పెట్రోలు పోసి నిప్పంటించాడు. లక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు.

Tuesday 18 November 2014

హైదరాబాద్‌లో ఉగ్రవాది అరెస్టు

హైదరాబాద్: మయన్మార్‌కు చెందిన ఉగ్రవాది ఖలీద్‌ను జాతీయ భద్రతా సంస్థ అధికారులు అరెస్టు చేసినట్లు తెలిసింది. వర్థమాన్ పేలుడు కేసులో ఖలీద్‌కు సంబంధం ఉంది.

తెరాసలో చేరనున్న మరో విపక్ష సభ్యులు.. కేసీఆర్ ప్రోత్సాహంతో

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో ప్రతిపక్షాలకు చెందిన మరో నలుగురు శాసనసభ్యులు చేరనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నలుగురిలో కాంగ్రెసు శాసనసభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు సమాచారం. 
 
మరోవైపు సాక్షాత్ ముఖ్యమంత్రే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనీ దీనిపై సభలో చర్చ జరపాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టి ఒక రోజు సభ నుంచి సస్పెండ్‌కు గురైన విషయం తెల్సిందే. తమ పార్టీ శాసనసభ్యులను నిలువరించుకోవడానికే కాంగ్రెస్ శాసనసభ్యులు శాసనసభలో దుమారం రేపినట్లు భావిస్తున్నారు. అయినప్పటికీ టిఆర్ఎస్‌లోకి వలసలు ఆగే పరిస్థితి లేదని అంటున్నారు. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ లక్ష్యాన్ని సాధించేందుకే తాము తెరాసలో చేరుతున్నట్లు పార్టీ మారుతున్న శాసనసభ్యులు చెబుతున్నారు. ఇటీవలే టిఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ శాసనసబ్యుడు కె. యాదయ్య వ్యవహారంపై అధికార టిఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షాలకు మధ్య శాసనసభ ఆవరణలో మాటల యుద్ధం నడిచిన విషయం తెల్సిందే.

Monday 17 November 2014

ఉస్మానియా బిడ్డల మీద లాఠీ విరిగింది

 ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల మీద లాఠీ విరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియమాకాలు చేపట్టాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం మానుకోవాలని కోరుతూ ఉస్మానియా విద్యార్థి, నిరుద్యోగ ఐకాస అసెంబ్లీకి ర్యాలీ చేపట్టింది. అయితే పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీని దిగ్బంధం చేశారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టారు. దాంతో విద్యార్థులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తూ అసెంబ్లీకి వెళ్తున్న తమమీద ఈ దౌర్జన్యం ఏమిటని పోలీసులను ఆగ్రహంగా ప్రశ్నించారు. అయితే విద్యార్థుల ప్రశ్నలకు పోలీసులు లాఠీలతో సమాధానం చెప్పారు. ప్రశ్నించినందుకు బహుమతిగా లాఠీలతో విద్యార్థులను చావబాదారు. ఆడపిల్లలని కూడా చూడకుండా విద్యార్థులను చావబాదారు. తమ అక్కచెల్లెళ్ళను, అన్నదమ్ములను పోలీసులు చావబాదుతూ ఉండటం చూసి విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసు నిర్బంధాన్ని తప్పించుకుని అసెంబ్లీ వైపు వెళ్ళడానికి విద్యార్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా విద్యార్థులను అడ్డుకోవడానికి తమ బలాన్ని, లాఠీలను, బూటు కాళ్ళను ఉపయోగిస్తున్నారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ రణరంగాన్ని తలపిస్తోంది. కొంతమంది విద్యార్థుల తలలు పగిలినట్టు తెలుస్తోంది. తమను లాఠీలతో దారుణంగా చితకబాదుతున్న పోలీసుల మీదకు విద్యార్థులు రాళ్ళతో దాడి చేశారు.

స్వాతంత్ర్యం కోసం ఉరికంబం ఎక్కలేదన్న బాధ ఉంది

సిడ్నీ :  భారత ప్రధాని నరేంద్ర మోదీకి ...సిడ్నీలో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు వేద మంత్రాలు, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించారు. సిడ్నీలోని ఒలింపిక్ పార్క్ స్టేడియంలో మోదీ ప్రసంగించారు. ముందుగా ఆయన తన ప్రసంగాన్ని ముందుగా ఇంగ్లీష్ లో ప్రారంభించి అనంతరం హిందీలో మాట్లాడారు.  సిడ్నీలో ఈ వాతావరణం చూస్తుంటే ఎంతో ఉత్సాహం కలుగుతోందన్నారు.  మీ ప్రేమ, స్వాగతం 123 కోట్ల భారతీయులకు అంకితమిస్తున్నట్లు మోదీ తెలిపారు. 50 ఏళ్ల క్రితమే స్వామి వివేకానందుడు తన ఆలోచనలను ప్రపంచానికి అందించారని ఆయన అన్నారు.

ప్రపంచమంతా ఒక్క తాటిపైకి రావాలని వివేకానందుడు పిలుపునిచ్చారని మోదీ పేర్కొన్నారు. స్వాతంత్ర భారతంలో పుట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. స్వాతంత్ర్య సమరంలో తాను పాలుపంచుకోనందుకు బాధగా ఉందని ఆయన అన్నారు. దేశం కోసం మరణించే అవకాశం అందరికీ రాదని మోదీ పేర్కొన్నారు.  స్వాతంత్ర్యం కోసం ఉరికంబం ఎక్కలేదన్న బాధ ఉందని ఆయన అన్నారు.   భారత ప్రధాని ఆస్ట్రేలియా రావటానికి 28 ఏళ్లు పట్టిందని మోదీ తెలిపారు.

Sunday 16 November 2014

నాగార్జున వర్సిటీలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేవ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సోమవారం నాగార్జున యూనివర్సిటీని సందర్శించనున్నారు. యూనివర్సిటీలోని ఆడిటోరియం అసెంబ్లీ నిర్వహణకు బాగుంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఏపీ రాజధానిని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతవరకు నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా ముఖ్య శాఖల కార్యాలయాలను తరలించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హైదరాబాద్ లో సల్మాన్ చెల్లి పెళ్లికి 2 కోట్లు..తరలి వస్తున్న బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చెల్లె పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నుమాలో ఈనెల 18న జరిగే వేడుక కోసం సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలి రానున్నారు. 
సల్మాన్ చెల్లెలు అర్పిత వ్యాపార వేత్త ఆయుష్ శర్మ ఈనెల 18న ఒక్కటౌతున్నారు. ఈ వివాహ వేడుక కోసం సల్మాన్ అక్షరాలా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట.
చారిత్రక ఫలక్ నుమా నిజాం ప్యాలెస్ ను చెల్లి పెళ్లి కోసం ఈనెల 17,18,19 తేదీలను సల్మాన్ ఖాన్ ఇప్పటికే బుక్ చేశారు. ఈ హోటళ్లో 60 గదులున్నాయి. 
ఈ వేడుకకు రావాల్సిందిగా సల్మాన్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. అయితే ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి రాలేనని చెప్పారు. అలాగే సోనియాగాంధీని ఆహ్వానించినా కుదరదని చెప్పేసింది. ఇదిలా ఉంటే...బాలీవుడ్ స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యేందుకు తరలిరానున్నారు. హృతిక్ రోషన్, కత్రినా కైఫ్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకునే, సైఫ్ అలీఖాన్, హేమమాలిని, ధర్మేంద్ర, కరణ్ జోహార్ తో పాటు చాలామంది బాలీవుడ్ తారలు హైదరాబాద్ కు తరలి రానున్నారు. 
ఇక టాలీవుడ్ కి చెందిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాంచరణ్, రాణాతో పాటు మరికొంతమందికి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. 
ఈ వేడుక జరిగే మూడు రోజులు సందర్శకులను ఈ హోటల్ కు అనుమతించరు. వేడుక జరిగే ఆ మూడు రోజులు ప్రభుత్వ బందోబస్తుతో పాటు సల్మాన్ ప్రైవేట్ సెక్యూరిటీ కనుసన్నల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. 

పిల్లా నువ్వులేని జీవితం తొలి రోజు కలెక్షన్ల వివరాలు.. ఆశ్చర్యం.

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ఆరంగ్రేటం చిత్రం పిల్లా నువ్వులేని జీవితం సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఈ సినిమా అటు నైజాంతో పాటు ఇటు ఏపీలోను మంచి కలెక్షన్లు రాబడుతోంది. తొలి రోజు కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. తొలి రోజు మొత్తంగా రూ 2.28 కోట్లను ఈ సినిమా వసూలు చేసింది.

నైజాం-85 లక్షలు
సీడెడ్- 42 లక్షలు
గుంటూరు-24.6 లక్షలు
వైజాగ్-23 లక్షలు
తూర్పు గోదావరి- 21.8 లక్షలు
పశ్చిమ గోదావరి- 14.5 లక్షలు
కృష్ణా- 10.8 లక్షలు
నెల్లూరు- 7.3 లక్షలు
ఈ సినిమా తొలి రోజే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ భారీ కలెక్షన్లు సాధించింది. తొలి వారం ముగిసే సరికి బయ్యర్లు, నిర్మాతుల భారీగా లాభపడతారన్న విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

బాహుబలితో పోటీకి గోపాలా.. గోపాలా.. బిగ్‌ఫైట్‌కు రెఢీ

క్టరీ వెంకటేష్-పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం గోపాలా.. గోపాలా తొలుత సంక్రాంతి బరిలో ఉంటుందని అందరూ ఆశించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సంక్రాంతి బరినుంచి తప్పుకుందని అంటున్నారు. మరో 20 రోజుల షూటింగ్‌తో పాటు పవన్ పార్ట్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందట. దీంతో ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టమేనన్న అభిప్రాయం టాలీవుడ్‌లో వ్యక్తమవుతోంది. 

సంక్రాంతికి గోపాలా మిస్ అయితే సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అంటే మార్చి లేదా ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో బాహుబలితో పోటీకి సిద్ధమవుతుందని సమాచారం. అదే జరిగితే భారీ బడ్జెట్ సినిమా బాహుబలి వర్సెస్ గోపాలా.. గోపాలా పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

తెరాసలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్య.. లైన్లో మాజీ మంత్రి, తేదేపా ఎమ్మెల్యే


తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు తేదేపా, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు అధికార తెరాసలో చేరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం కాంగ్రెస్‌కు చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ఈ రోజు తెరాస గూటికి చేరుతున్నారు. ఆయనతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా భారీగా తెరాసలో చేరుతుండడంతో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ కనుమరుగైంది.

ఇదిలా ఉంటే తెరాసలో చేరేందుకు కాంగ్రెస్‌కే చెందిన మాజీ మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తెరాస మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఆయన ప్రస్తుతానికి మౌనంగా ఉన్నా కొద్ది రోజుల్లో తెరాసలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే తోలుకుంట్ల ప్రకాష్‌గౌడ్ కూడా తెరాసలో చేరతారన్న వార్తలు వస్తున్నాయి. ఆయనతో జిల్లాకు చెందిన మంత్రి మహీధర్‌రెడ్డి మంతనాలు జరుపుతున్నారట.

ఇంటిని ఖాళీ చేయాలని నాకు నోటీసిస్తారా?.. అన్యాయం: చిరంజీవి ప్రశ్న

chiranjeevi
ఢిల్లీలో తాను నివాసముంటున్న ఇంటిని ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చెందిన కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూ) అధికారులు తనకు నోటీసు ఇవ్వడం పట్ల కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నోటీసు అంశంపై ఆయన మాట్లాడుతూ ఇది చాలా అన్యాయమన్నారు. ఖాళీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే, తనకు ప్రత్యామ్నాయ నివాసం చూపకుండా ఇప్పుడే ఖాళీ చేయమని నోటీసు ఇవ్వడం సరికాదన్నారు. 
 
తన పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త నివాసం కేటాయించాలని కోరానని, అప్పుడు స్పందించని అధికారులు.. ఇపుడు ఉరుకులు పరుగుల మీద ఇల్లు ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికైన మించి పోయిందేమీ లేదనీ తనకు సరైన ఇంటిని చూపిస్తే తక్షణం ఖాళీ చేస్తానని చిరంజీవి తెలిపారు.
 
కాగా, చిరంజీవి ఢిల్లీలో ప్రస్తుతం ఉంటున్న అధికారిక ప్రభుత్వ బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలంటూ గురువారం కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ) నోటీసు అంటించిన సంగతి తెలిసిందే.

Tuesday 28 October 2014

నాగ్‌తో రొమాన్స్‌కు తమన్నా ఓకే: కార్తీ వున్నాడుగా అందుకేనా


నాగార్జున- కార్తీల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ నిర్మించనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించనున్నారు. తాజాగా, ఈ సినిమాకి సంబంధించి మరో హాట్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమిటంటే, ఈ సినిమాలో ఒకే హీరోయిన్ ఉంటుందని సమాచారం. 
 
నాగార్జున, కార్తీలు ఈ చిత్రంలో ఒకే హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్నారని.. ఈ ఛాన్స్‌ను మిల్కీ బ్యూటీ తమన్నా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తమన్నా కార్తీతో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించింది. తమిళంలో రూపొందిన 'పయ్యా'(తెలుగులో ఆవారా), 'సిరుత్తై'(తెలుగు విక్రమార్కుడికి రీమేక్) చిత్రాల్లో వీరిద్దరు హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక నాగార్జునతో తొలిసారి తమన్నా రొమాన్స్ చేయనుంది. దీంతో ఇన్నాళ్ళు తమన్నాతో రొమాన్స్ చేయాలని కలగన్న నాగ్ ఆశ నెరవేరనుంది. 
 
గతంలో తమన్నాతో సినిమా చేయాలని నాగార్జున ఉవ్విళ్లూరాడని వార్తలొచ్చాయి. అయితే తమన్నా నాగ్ సీనియర్ కావడంతో అంగీకరించలేదని.. ప్రస్తుతం మల్టీస్టారర్ కావడంతో నాగ్‌తో జతకట్టేందుకు మిల్కీ బ్యూటీ ఓకే చెప్పేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఇంకా యంగ్ హీరో కార్తీ ఉన్నాడనే ధైర్యంతోనే నాగ్‌తో చేసేందుకు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోం

బక్క హీరో ధనుష్‌తో రొమాన్స్ చేయనున్న త్రిష!


బక్క హీరో ధనుష్‌తో సినిమా చేయలేదనే టాక్ రావడంతో త్రిష ఆ హీరోతో నటించాల్సిందేనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ధనుష్-త్రిష ఈ మధ్య తెగ క్లోజ్‌గా ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఇవి నిజం చేసేటట్లు ధనుష్ చిత్రంలో నటించే ఆఫర్‌ను త్రిష కొట్టేసింది. ఈ ఛాన్స్‌ కోసం త్రిష పేరును ధనుష్ రెకమెండ్ చేశాడట. 
 
గతంలో ధనుష్ నటించిన 'ఆడుగళం' సినిమా కోసం త్రిషను తీసుకున్నప్పటికీ మొదట్లోనే ఆమెను డ్రాప్ చేశారు. ఈ నేపథ్యంలో త్రిష ఇప్పుడు ధనుష్‌తో కలిసి ఓ సినిమాలో నటించనుందనే వార్త కోలీవుడ్‌లో ప్రచారంలో వుంది. 
 
ఇటీవల ధనుష్‌తో 'వేలై ఇల్లా పట్టదారి" చిత్రాన్ని రూపొందించిన వేల్ రాజ్ మళ్లీ ధనుష్ తోనే ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో త్రిషను కథానాయికగా తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్ రికమండేషన్ కారణంగానే ఈ చెన్నై ముద్దుగుమ్మకి ఆఫర్ వచ్చినట్లు సమాచా
రం

ఖైదీ భార్యను వేధిస్తున్న వార్డర్.. కేసు నమోదు

ఖైదీ భార్యను వేధిస్తున్న వార్డర్.. కేసు నమోదు
హైదరాబాద్: మహిళల పట్ల వేధింపులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. చర్లపల్లి జైలు వార్డర్ తన భార్యకు తరుచు ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ ఓ ఖైదీ మంగళవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం రాములు అనే ఖైదీ చర్లపల్లి జైళ్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని చూసేందుకు అతడి భార్య తరుచూ జైలుకు వచ్చేది. ఆ క్రమంలో జైలు వార్డర్ వెంకన్న ఆమె నుంచి సెల్ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. అప్పటి నుంచి తరచూ శిక్షను అనుభవిస్తున్న ఖైదీ రాములు భార్యకు ఫోన్ చేసి వేధించేవాడని తెలిపారు. వార్డర్ వేధిస్తున్న విషయాన్ని తన భర్త రాములుకు తెలిపింది అతని భార్య. దీంతో రంగంలోకి దిగిన రాములు జైలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారులు సరైన రీతిలో స్పందించక పోగా.. రాములు భార్యపై వేధింపులు మరింతగా పెరిగాయి. ఆ విషయాన్ని రాములకు వెల్లడించగా.. రాములు కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాలో వార్తా కథనాలు ప్రసారం అయ్యాయి

'ధూమ్' సినిమా తరహాలో సొరంగం తవ్వి బ్యాంకులో దోపిడీ



హర్యానా రాష్ట్రంలో 'ధూమ్' అనే బాలీవుడ్ చిత్రం తరహాలో ఓ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. ఇందుకోసం దొంగలు ఏకంగా 125 అడుగుల మేర సొరంగం తవ్వడం గమనార్హం. హర్యానాలోని గోహనా టౌన్‌షిప్‌లో సొరంగం తవ్వి ఓ బ్యాంకు స్ట్రాంగ్ రూంకు చేరుకొని డబ్బులు, కోట్లాది రూపాయల నగలు, బంగారం దోచుకున్నారు. దోపీడిని సోమవారం ఉదయం గుర్తించారు. సొరంగం తవ్వి, స్ట్రాంగ్ రూంకు వచ్చినందున.. ఈ దోపిడీ శనివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం మధ్యన జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. 
 
chandigarh mapసదరు దొంగలు స్ట్రాంగ్ రూంలో ఉన్న 360 లాకర్లలోని 90 లాకర్లను దోచుకెళ్లారని బ్యాంకు మేనేజర్ చెప్పారు. పోలీసులు బ్యాంకులోని రెండు గదుల్లో సొరంగం తాలుకు మట్టిని గుర్తించారు. దొంగలు లోనికి వచ్చి అన్ని కిటికీలు మూసేశారు. దీంతో వారు బయటకు కనిపించకుండా పోయారు. తాము సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని గొహానా డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసు సోమవారం చెప్పారు. బ్యాంకు లోపల పలు సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ, స్ట్రాంగ్ రూంలో మాత్రం ఎలాంటి కెమెరాలు లేవని చెప్పారు.

Tuesday 21 October 2014

మీరట్‌లో దారుణం: ప్రేయసిపై ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్

gang rape
మీరట్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేయసిని మాయమాటలతో నమ్మించి ఓ దుర్మార్గుడు తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు. భవాన్ పూర్ ప్రాంతానికి చెందిన బాధితురాలితో ఓ వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. 
 
తనకు పెళ్లైన విషయాన్ని దాచి పెట్టి ఆమెను ప్రేమలోకి దింపాడు. ఈ విషయం ఆమెకు తెలిసింది. దీంతో అతడిని నిలదీసింది. ఈ నెల 18వ తేదీన రెస్టారెంటుకు రావాలని ఆమెకు అతను ఫోన్ చేశాడు. అక్కడ అతని సోదరుడు, మరో స్నేహితుడు ఉన్నాడు. ఆమెను మాటల్లోకి దించి ఓ ప్రాంతానికి తీసుకు వచ్చారు.
 
తర్వాత మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిని వారు వీడియో తీశారు. తమ గురించి ఎవరికైనా చెబితే వీడియోను ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరించారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు

ఐఎస్ఐఎస్‌ మరో ఘాతుకం.. వ్యభిచారం చేసిందని తండ్రి రాళ్లతో

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గ్రూపు మరో ఘాతుకానికి పాల్పడింది. మధ్య సిరియాలోని హమా ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ వ్యభిచారం చేసిందంటూ ఆమెను ఐఎస్ఐఎస్ గ్రూపు రాళ్లతో కొట్టి చంపేశారు. అంతేగాకుండా ఆ వీడియోను ఆన్ లైన్‌లో పోస్టు చేశారు.
 
ఈ వీడియో తొలి ఐదు నిమిషాల్లో సదరు మహిళ తన తండ్రితో కలిసి కనిపిస్తుంది. వారి పక్కనే ఓ ఐఎస్ఐఎస్ మిలిటెంట్ కూడా కనిపిస్తాడు. ఆమె తన తండ్రిని క్షమించమని అడిగినా, అతడు నిరాకరించినట్టు వీడియోలో వెల్లడైంది. 
 
క్షమిస్తే ఆమె స్వర్గానికి చేరుకుంటుందని, క్షమించాలని మిలిటెంట్ చెప్పినా, ఆమె తండ్రి నిరాకరించాడు. అంతేగాకుండా, ఆ కిరాతక తండ్రే రాళ్ళను పోగు చేశాడు. ఆ రాళ్ళతోనే ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు ఆమెను చనిపోయేదాకా కొట్టారు. 

టీడీపీ ఎమ్మెల్యే పేరిట పరీక్ష రాస్తూ కెమెరాకు చిక్కాడు

విజయవాడ: కృష్ణా జిల్లా పెనమలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సింగ్‌పూర్‌లో ఉండగా సోమవారం నాడు ఓ పరీక్షా కేంద్రంలో ఆయన స్థానంలో ఓ యువకుడు ఇంటర్ పరీక్ష రాస్తూ కెమెరాలకు చిక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే సోమవారం నాటి పరీక్షకు ఎమ్మెల్యే ప్రసాద్ గైర్హాజరయ్యారంటూ స్క్వాడ్ అధికారి షేక్ రషీద్ చెబుతున్నారు. గుట్టురట్టు కావటంతో ఆయన గైర్హాజరైనట్లు చూపుతున్నారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వన్ సిట్టింగ్‌లో ఇంటర్ కోర్సు పూర్తి చేసేందుకు ప్రసాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ కోర్సుకు గంగూరులోని ఓ మహిళా కళాశాల ద్వారా ఇటీవల పరీక్ష ఫీజు చెల్లించారు. సెప్టెంబర్ 27న ప్రారంభమై నవంబర్ 10వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు పెనమలూరు మండలం పోరంకిలోని తాతినేని గోపయ్య అకాడమీకి చెందిన ఎస్‌కెవిఎస్ జూనియర్ కళాశాలను కేంద్రంగా నిర్ణయించారు. ఇప్పటికే మూడు పరీక్షలు జరిగాయి. ప్రసాద్ హాల్ టిక్కెట్ నెంబర్‌తో రెండు పరీక్షలకు హాజరైనట్లు రికార్డుల ద్వారా తెలుస్తోందంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఆయన సింగ్‌పూర్ వెళ్లారు. సోమవారం నాలుగో పరీక్షకు ఓ యువకుడు హాజరై ప్రసాద్ పేరిట ఆన్సర్ షీటుపై సంతకం కూడా చేసినట్లు కొందరు అభ్యర్థులు సెల్‌ఫోన్ ద్వారా తీసిన ఫొటో ద్వారా తెలుస్తోందని చెబుతున్నారు. అయితే ఈ రహస్యం బైటకు పొక్కటంతో పరీక్ష రాసినట్లుగా భావిస్తున్న యువకుడు అదృశ్యమయ్యాడు. మరోవైపు, పరీక్షకు ఎమ్మెల్యే ప్రసాద్ గైర్హాజరైనట్లు పరీక్ష ఆరంభమైన కొన్ని నిమిషాల్లోనే నమోదు చేశామని చెబుతున్నారు. సోమవారం పరీక్షకు 480 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 408 మంది హాజరయ్యారు. ప్రసాద్ రాయాల్సిన పరీక్షను ఆయన పేరుతో మరొకరు రాసిన సంఘటనపై విచారణ జరిపించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. బోడె ప్రసాద్‌కు ఇంటర్మీడియట్ పరీక్షలు ఇబ్బంది తెచ్చిపెట్టాయని అంటున్నారు. సోమవారం భౌతిక శాస్త్రం పరీక్ష రాస్తుండగా.. కేంద్రంలో ఉన్న కొందరు అభ్యర్థులు ఎమ్మెల్యే స్థానంలో గుర్తు తెలియని యువకుడు పరీక్ష రాస్తున్నాడంటూ ఆ యువకుడి ఫోటోలు, సమాధాన పత్రాలను సెల్‌ఫోన్లో వాట్సప్, ఎస్సెమ్మెస్ ద్వారా బయటకు చేరవేశారు. విషయం తెలియడంతో మీడియా ప్రతినిధులు పరీక్ష కేంద్రానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వీరిని పరీక్ష కేంద్రంలోకి తొలుత నిరాకరించినా, తర్వాత వెళ్లనిచ్చారు. అయితే, అప్పటికి ఎమ్మెల్యేకు కేటాయించిన స్థానం ఖాళీగా కనిపించింది. అప్పటికే అక్కడకు చేరుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ప్రసాద్ పేరుతో ఉన్న సమాధాన పత్రం ఫోటోను అధికారులకు చూపించారు. ఫోటోలను పరిగణించబోమని నిజపత్రాలనే ప్రమాణంగా తీసుకుంటామని అధికారులు చెప్పారు. ప్రసాద్ పరీక్షలకు హాజరు కాలేదని వారు చెప్పారు. సింగపూర్లో ఉండటంతో సోమవారం నాటి పరీక్షకు తాను హాజరు కాలేదని, దీనిని గమనించిన ప్రత్యర్థులు తన పైన కుట్ర పన్ని అభాసుపాలు చేయాలని చూస్తున్నారని బోడె ప్రసాద్ అన్నారు.

ఆ ఛానెళ్ళని జనం అడగటం లేదట

దాదాపు నాలుగు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారం జరగడం లేదు. ఈ విషయంలో జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ , ‘‘ప్రజలు ఆ రెండు ఛానెళ్ళని ప్రసారాలను ప్రసారం చేయాలని కోరడం లేదు. అందుకే ప్రసారం చేయడం లేదు. ఆ రెండు ఛానెళ్ళ ప్రసారాలను నిలిపివేయడంలో ప్రభుత్వ పాత్ర, ఎంఎస్‌ఓల పాత్ర ఏమీ లేదు. న్యాయస్థానాలు కూడా మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. మాతో వ్యాపార ఒప్పందాలు కొనసాగించే ఆలోచన ఆ రెండు సంస్థల యాజమాన్యాలకు లేదు’’ అన్నారు

ఆళ్లగడ్డ ఏకపక్షమే: టిడిపి, కాంగ్రెస్ పోటీకి దూరం

హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గానికి అక్టోబర్ నెలలో జరగాల్సిన ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు సోమవారం ప్రకటించాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీఅభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా విజయలక్ష్మి నామినేషన్ వేశారు. అయితే విజయలక్ష్మి పోటీ నుంచి ఉపసంహరించుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. చిన్నాచితకా పార్టీలు పోటీచేస్తామని ప్రకటించడంతో పోటీ చేయవద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నారు. దీంతో వారు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. కాగా ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియనుంది. పోటీలో ఎవరూ లేకపోతే అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విన్నపానికి స్పందించని వారు ఎవరైనా నామినేషన్ వేసినా ఎన్నిక ఏకపక్షంగా జరిగే అవకాశముంది. ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయడం లేదని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. నంద్యాల ఎమ్మెల్యే, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు భూమా నాగిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన రెడ్డి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఆనవాయితీలను పాటిస్తూ పోటీ నుంచి తప్పుకోవడం హర్షనీయమని వారు పేర్కొన్నారు. కాగా, కాగా, ఆళ్లగడ్డకు నవంబర్ 8న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 12న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Monday 20 October 2014

ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో టిడిపి పోటీ చేయదు: కృష్ణమూర్తి

హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు జరుగనున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అన్నారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమను కలిసి ఆళ్లగడ్డలో పోటీ చేయవద్దని అభ్యర్థించినట్లు తెలిపారు. మైసూరారెడ్డి, తదితరులు తమను కలిశారని ఆయన చెప్పారు. ఇది ఇలా ఉండగా అంతకుముందు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిశారు. ఆళ్లగడ్డలో పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తామని ఆయనకు చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం అందుకు సుముఖత చూపలేదు. కాగా, సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ చనిపోయినప్పుడు ఆ స్థానంలో వారి కుటుంబీకులు పోటీ చేస్తే ఇతర పార్టీ తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టకుండా చూడటం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో పాత సంప్రదాయాలు పాటించాలని పార్టీ నేతలకు చంద్రబాబునాయుడు సర్ది చెప్పారు. గత మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. అప్పుడు జరిగిన ఆళ్లగడ్డ శాసనసభ ఎన్నికల్లో శోభానాగిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాగా, ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివంగత మాజీ పమ్మెల్యే శోభా నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియ గత శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఆళ్లగడ్డ తహసీల్డార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.

బాణసంచా తయారీ కేంద్రంలో బ్లాస్ట్: 13 మంది సజీవ దహనం

తూర్పు గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 13 మంది సజీవదహనమయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
జిల్లాలోని యు. కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం ఈ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. రెండు అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయి. బాణసంచా అనధికారికంగా తయారు చేస్తుండగా ఈ విస్ఫోటనం సంభవించింది. 
 
మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతున్నారు. సంఘటన ప్రాంతం వద్ద, ఆసుపత్రి వద్ద మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పేలుడు ఘటన పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. 

తల్లిదండ్రులను చంపేసి 72 రోజులు ఇంట్లోనే ఉంచేసిన బాలిక

murder
16 సంవత్సరాల బాలిక తన 22 సంవత్సరాల బాయ్ ఫ్రెండ్ తో కలిసి దత్తత తీసుకున్న తల్లిదండ్రులను చంపిన ఘటన వడోదరాలో చోటు చేసుకుంది.
ఇంటి నుండి చెడు వాసన రావడంతో ఇంటి చుట్టుపక్కల వారు పోలిసులకు సమాచారం అందించారు.పోలీసులు బలవంతంగా తలుపులు తెరచి చూస్తే అందులో రెండు శవాలు కనిపించాయి.
అమ్మాయి మీద అనుమానంతో పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది.హత్య చేసింది తానే అని ఒప్పుకుంది.తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ హత్య చేసినట్టు జాయింట్ పోలీస్ కమీషనర్ డీజే పాటిల్ తెలిపారు.హత్య అనంతరం ఆ బాలిక బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉంటుంది.తన బాయ్ ఫ్రెండ్ వచ్చి శవాల మీద అప్పుడప్పుడు సెంట్ చల్లి వేలుతుండేవాడు.ఈ హత్య ఆగష్టు 3న జరిగినట్టు,72 రోజుల పాటు శవాలను ఇంట్లోనే ఉంచారని పోలీసుల విచారణలో తెలిసింది.
ఎప్పుడూ తల్లిదండ్రులు కొట్టేవారని,నాకు ఇష్టం లేకున్నా చదువుకోమని బలవంతం చేసే వారని అందుకే చంపేశానని పోలీసులకు వివరించింది ఆ బాలిక.ప్రస్తుతానికి ఆ బాలిక ఒక ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి అభ్యసిస్తుంది.
పోలిసుల సమాచారం ప్రకారం వడోదరా నగరంలోని మంజల్ పూర్ ప్రాంతంలో ఉన్న తిరుపతి సొసైటీ వద్ద 63 సంవత్సరాల శ్రీహరీ వినోద్ మరియు 60 సంవత్సరాల అతని భార్య స్నేహ నివాసముంటున్నారు.వీరికి సంతానం లేకపోవడంతో 15 సంవత్సరాల క్రితం సంవత్సరం వయసున్న ఆ బాలికను దత్తత తీసుకున్నారు

జయలలితకు రజనీకాంత్ లేఖ.. బీజేపీ షాక్

అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి, శనివారం జైలు నుంచి విడుదలైన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సూపర్ స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ రాశారు. ఇది బీజేపీ నేతలను షాక్‌కు గురిచేసింది. రజనీని తమ పార్టీలోకి తెచ్చేందుకు బీజేపీ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. 
 
ఇప్పుడు ఆయన హఠాత్తుగా జయకు లేఖ రాయడం బీజేపీకి రుచించలేదని అంటున్నారు. రజనీతో పాటు కేంద్రమంత్రి మేనకా కాంధీ కూడా జయకు శుభాకాంక్షలు తెలియ చేయడం పార్టీలో చర్చించుకుంటున్నారని చెబుతున్నారు.
 
అయితే, రజనీకాంత్ శుభాకాంక్షలు చెప్పడంపై కోలీవుడ్‌లో భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ, బీజేపీ గెలిచినప్పుడు వారికి అభినందనలు తెలిపారని, ఇప్పుడు జయలలిత జైలు నుంచి విడుదలైనప్పుడు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారని ఇందులో కొత్తగా చర్చించుకోవాల్సిందేమీ లేదన్నారు. 

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటైంది

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటైంది. ఈ మేరకు జివో నెం21ని ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఈ ఏడాది విద్యార్థులు ఇంటర్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వ పరిధిలో రాయనున్నారు.

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

సికిందరాబాద్: పాట్నా నుంచి బెంగళూరు వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ రైలులో పాట్నీ కారు కింద ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం వల్లే మంటలు వ్యాపించాయని, సకాలంలో వాటిని అదుపు చేయడంతో ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు.

సచిన్ రికార్డును బద్దలకొట్టిన కోహ్లీ

సచిన్ రికార్డును బద్దలకొట్టిన కోహ్లీ!
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. పిన్న వయసులోనే టెస్టు క్రికెట్ ఆడిన క్రికెటర్ గా చరిత్రకెక్కడమే కాకుండా, టెస్టుల్లో అత్యధిక సెంచరీలు(51) సాధించిన బ్యాట్స్ మెన్ గా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే సచిన్ టెస్టు రికార్డుకు పెద్దగా ముప్పులేకపోయినా.. వన్డే రికార్డుపై అనేక సందేహాలు తలెత్తున్నాయి. సచిన్ వన్డే రికార్డును అధిగమించే క్రమంలో మరో భారత్ ఆటగాడు విరాట్ కోహ్లీ తొలి అడుగు వేశాడు.

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ, టెండూల్కర్ రికార్డుల ఛేదనలో తొలి విజయం సాధించాడు. ఆ మ్యాచ్‌లో 127 పరుగులు చేసిన విరాట్, తన కెరీర్‌లో 20 సెంచరీలను పూర్తి చేశాడు.  కేవలం 64 ఇన్నింగ్స్‌లోనే 20 సెంచరీలు చేసిన కోహ్లీ, అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను చేరిన క్రికెటర్‌గా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో మొత్తం 49 సెంచరీలు చేసిన సచిన్, తొలి 20 సెంచరీలు చేసేందుకు 197 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది. దీంతో కోహ్లీ సచిన్ పేరిట ఉన్న 20 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. అతి తక్కువ సమయంలోనే సచిన్ రికార్దుపై పైచేయి సాధించిన కోహ్లీ.. వన్డేల్లో అత్యధిక రికార్డులు నమోదు చేస్తాడా?లేదా అనేది వేచి చూడాల్సిందే

మళ్లీ పి.టి. ఉష పరుగులు: గుజరాత్ విద్యార్థులకు ట్రైనింగ్

ptushaనాటి పరుగుల రాణి పీటీ ఉష గుజరాత్ లో పిల్లలకు దీర్ఘకాలిక శిక్షణ ఇచ్చేందుకు సమ్మతించినట్లు తెలిసింది. దేశ ప్రధాని నరేంద్రమోడీ కోరిక మేరకే గుజరాత్ లో కొంతమంది బాలలను వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి, వారికి చైనా తరహాలో దీర్ఘకాలిక శిక్షణ ఇవ్వడానికి ఉష అంగీకరించినట్లు తెలుస్తోంది.
 
అక్కడ 10 - 11 ఏళ్ల వయసున్న 30 మంది పిల్లలను ఎంపిక చేసి, వారికి ప్రాథమిక శిక్షణ ఇచ్చి. ఆ తర్వాత వాళ్లు ఏయే విభాగాలకు సరిపోతారో అంచనా వేసి ఆ ప్రకారం వాళ్లను తీర్చిదిద్దడం ఈ దీర్ఘకాలిక ప్రణాళిక లక్ష్యం. సియోల్ ఒలింపిక్స్ లో భారత పతాకాన్ని అథ్లెటిక్స్ విభాగంలో పీటీ ఉష రెపరెపలాడించిన విషయం తెలిసిందే. 
 
ఇప్పటికే ఆమె తన ఊరు సమీపంలో ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ ను తెరిచింది. ఇటీవల ఆమె స్కూలు నుంచి వచ్చిన ముగ్గురు బాగా ప్రతిభ చూపారు. యువ క్రీడాకారులను తీర్చిదిద్ది, వారి ప్రతిభకు మెరుగులు దిద్దేందుకు ఆమె తీసుకున్న నిర్ణయం మంచిదేనని క్రీడా వర్గాలు అంటున్నాయి. 

కాశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరుచేస్తాం : బిలావల్ భుట్టో

కాశ్మీర్‌ను భారత్ నుంచి వేరుచేసి తీరుతామని పాక్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో కొడుకు, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) యువ నేత బిలావల్‌ భుట్టో ప్రకటించారు. ఆరు నూరైనా భారత్‌ నుంచి కాశ్మీర్‌ను సాధించి తీరతానని మహ్మద్‌ ఆలీ జిన్నా సమాధి దగ్గర జరిగిన ఒక ర్యాలీలో శపథం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను కాశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తినపుడల్లా భారతదేశమంతా గగ్గోలు పెడుతుంది. ఒక భుట్టో మాట్లాడితే ఏం సమాధానం చెప్పాలో వారికి తెలియదు. అందుకే ఆ గగ్గోలు’ అని వ్యాఖ్యానించారు. 
 
కాశ్మీర్‌పై తన వ్యాఖ్యలను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు. కాశ్మీర్‌ ముమ్మాటికీ పాకిస్థాన్‌లో భాగమవుతుందంటూనే కాశ్మీర్‌ పేరుతో భారత్ - పాక్‌ చర్చలను బందీగా చేసేందుకు ఎవరినీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. 

వేధించిన భర్తని చంపేసిన భార్య

కట్టుకున్న భర్త వేధింపులను ఒక దశ వరకూ భరించిన భార్య ఇక భరించలేక అతనిని హతమార్చింది. కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. దస్తగిరి, చిట్టెమ్మ అనే భార్యాభర్తలు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. అయితే దస్తగిరి ఎంతోకాలంగా భార్యమీద అనుమానంతో వేధిస్తున్నాడు. దీని మీద ఇద్దరి మధ్య ప్రతిరోజూ ఇద్దరూ గొడవపడేవారు. భర్త వేధింపులు బాగా మితిమీరడంతో చిట్టెమ్మ నిద్రిస్తున్న ఆదివారం అర్థరాత్రి దస్తగిరి తలపై రాయితో మోది హత్య చేసింది. నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

రైతులే లేకపోతే మనం లేం.. రుణమాఫీ చేస్తే తప్పేంటి?: హైకోర్టు

రుణాల కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రుణమాఫీ ఎందుకంటూ పిటిషన్ వేస్తారా? అంటూ పిటిషనర్‌పై హైకోర్టు ఫైర్ అయ్యింది. భవిష్యత్తులో ఇలా ప్రజల ప్రయోజనాలను కాలరాసే పిటిషన్లు వేస్తే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. 
 
రైతు రుణమాఫీపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులే లేకపోతే మనం లేమన్న విషయం గుర్తుంచుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే, సమగ్ర సర్వేపై విచారించిన హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Sunday 19 October 2014

మహారాష్ట్రలో ఎంఐఎం బోణీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం పార్టీ రెండు స్థానాలను గెలిచి సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీకే ఇప్పటి వరకూ పరిమితమైన ఈ పార్టీ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా బోణీ కొట్టింది. ఔరంగాబాద్ సెంట్రల్ నుంచి జర్నలిస్టు సయ్యద్ ఇంతియాజ్ జలీల్, ముంబై నగరంలోని బైకలా నియోజకవర్గం నుంచి న్యాయవాది వారిస్ యూసుఫ్ పఠాన్‌లు ఎంఐఎం పార్టీ తరఫున విజయం సాధించారు. ఇంతియాజ్ శివసేన అభ్యర్థి, మాజీ ఎంపీ ప్రదీప్ జైస్వాల్‌ను 20 వేల ఓట్ల తేడాతో, వారిస్ బీజేపీ అభ్యర్థి మధుకర్ చవాన్‌ను 1,357 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఎన్నికలలో మహారాష్ట్రలో ఎంఐఎం మొత్తం 24 స్థానాల్లో పోటీ చేసింది.

Saturday 18 October 2014

అతుల్ శర్మతో మాజీ భార్య లింకట: కూతురికి, పేస్‌కు బెదిరింపులు!

తనను, తన కూతురుని చంపుతానని క్రికెటర్ అతుల్ శర్మ బెదిరించినట్లు టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతుల్ శర్మతో తన మాజీ భార్య రియా పిళ్లైకి సంబంధాలున్నట్లు నిరూపించే సాక్ష్యాధారాలను ఆయన కోర్టుకు సమర్పించారు.
 
బాంద్రా కోర్టు కాంప్లెక్స్‌లో తనను, తన కూతురుని చంపుతానని అతుల్ శర్మ బెదిరించినట్లు పేస్ తెలిపారు. లియాండర్ పేస్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్టోబర్ 10వ తేదీన అతుల్ శర్మ తనను బెదిరించినట్లు ఆయన ఫిర్యాదులో పేస్ తెలిపారు.
 
ఇక అతుల్ శర్మపై కేసు నమోదు చేశామని, అరెస్టు మాత్రం చేయలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఆఫీసర్ కెవి నిగాడే చెప్పారు. కాగా.. పేస్ తనపై గృహ హింసకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ రియా పిళ్లై కేసు పెట్టారు.

సిమీ ఎక్స్ చీఫ్ సలావుద్దీన్ మృతి: నల్లగొండ యాక్సిడెంట్‌లో..

సిమీ ఎక్స్ చీఫ్ సలావుద్దీన్ మృతి చెందాడు. సలావుద్దీన్ అహ్మద్ (45) కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదంలో సిమీ మాజీ చీఫ్ మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. 
 
హైదరాబాదులోని చాంద్రాయణగుట్టకు చెందిన సలావుద్దీన్ నల్లగొండలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై కారులో హైదరాబాదు తిరిగి వెళ్తుండగా ప్రమాదంలో మరణించాడు.
 
పెద్దకాపర్తి శివారులోకి రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని సలావుద్దీన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సలావుద్దీన్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాదులోని సాయిసంజీవనీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు.
 
సలావుద్దీన్ గతంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ స్టూడెంట్ మూవ్‌మెంట్ (సిమి) జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన సలావుద్దీన్‌పై పలు కేసులు ఉన్నాయి.