Wednesday 17 September 2014

అజ్మీర్ దర్గాను సందర్శించిన మహేష్ బాబు

అజ్మీర్ దర్గాను సందర్శించిన మహేష్ బాబుప్రిన్స్ మహేష్ బాబు అజ్మీర్ దర్గాను సందర్శించారు. ఖ్వాజా మొయినుద్దీన్ చస్తీ వద్ద మహేష్ బాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ఆగడు రేపు విడుదల కానుంది. ఈ చిత్రం విజయవంతం కావాలని 
ఆయన ఆక్షాంకించారు. బిజినెస్ మెన్, దూకుడు, వన్ నేనొక్కడినే చిత్రాలలో హీరోగా నటించిన మహేష్ బాబు విడుదలకు ముందు ఈ దర్గాను సందర్శించారు.
14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఆగడు చిత్రం రూపొందింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. గతంలో వీరి కాంబినేషన్ లో దూకుడు చిత్రం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రేపు విడుదలకానుంది.

No comments:

Post a Comment