Saturday 13 September 2014

ప్రధాని మోడీ కోసం ఇష్టమైన లడ్డూలు చేస్తున్న తల్లి

 ప్రధాని మోడీ కోసం ఇష్టమైన లడ్డూలు చేస్తున్న తల్లిఅహ్మదాబాద్: చుర్మా కే లడ్డూ, లప్సీ, కన్సర్ లాంటి గుజరాతీ తీపి పదార్థాలను ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఆయన తల్లి హీరాబా సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ 17న నరేంద్ర మోడీ 64వ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన తన తల్లి హీరాబా(95) ఆశీర్వాదాలు తీసుకునేందుకు రానుండటంతో ఆమె ఈ పదార్థాలను సిద్ధం చేస్తున్నారు. గతంలో కూడా చాలా సార్లు తన పుట్టిన రోజున నరేంద్ర మోడీ స్వయంగా వెళ్లి తన తల్లి హీరాబా ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రస్తుతం మోడీ ప్రధాని మోడీ కోసం ఇష్టమైన లడ్డూలు చేస్తున్న తల్లి రాకకోసం ఆయన తల్లి ఎదురుచూస్తున్నారు. గాంధీనగర్‌లోని రాష్ట్ర సమాచార శాఖలో పని చేస్తున్న మరో కుమారుడు పంకజ్ మోడీ వద్ద హీరాబా ఉంటున్నారు. సెక్టార్ 22లోని పంకజ్ మోడీ ఉంటున్న ఇంటిని ఇప్పటికే శుభ్రం చేసినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. మోడీ రాక కోసం ఆ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. నరేంద్ర మోడీకి ఇష్టమైన స్వీట్లు తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. హీరాబాకు నరేంద్ర మోడీతోపాటు నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వారు సోమాభాయ్, నరేంద్ర, ప్రహ్లాద్, పంకజ్ మోడీ, వసంతి బెన్. వారిలో చిన్న కుమారుడైన పంకజ్ మోడీ వద్దే హీరాబా ఉంటున్నారు. కాగా, ప్రధాని మోడీ రానుండటంతో పంకజ్ మోడీ ఇంటి ఆవరణలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment