రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని బాబు తెలిపారు. రానున్న ఐదేళ్లలో 100 శాతం అక్షరాస్యతను సాధిస్తామని చెప్పారు. ఓడ రేవులను అభివృద్ధి పరుస్తామని... కోస్తా తీరాన్ని గేట్ వే ఆఫ్ ఇండియాగా తయారు చేస్తామని తెలిపారు.
ఇండస్ట్రియల్ కారిడార్, స్మార్ట్ సిటీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ప్రస్తుతానికి ఏపీ రాష్ట్రానికి ఎన్నో సమస్యలు ఉన్నాయని... అయితే, వాటన్నింటినీ అధిగమిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment