Friday, 12 September 2014

గోల్కొండ కోటపై జెండా ఎగురవేశాకే కేసీఆర్ నవాబయ్యాడు : ఎర్రబెల్లి

errabelli dayakar raoస్వాతంత్ర్యం దినోత్సవం రోజున గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నియంత నవాబుగా మారిపోయాడని టీ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. 
 
ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన తర్వాత కేసీఆర్‌కు నిరంకుశ బుద్ధులొచ్చాయన్నారు. అందుకే ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక్క ఆయన కుటుంబానికే 'బంగారు తెలంగాణ' కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 
 
కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలని డిమాండ్ చేశారు. వంద రోజుల పాలన ముగిసినా గ్రామాల్లో ఇంతవరకు ఏ పనీ పూర్తికాలేదన్న ఎర్రబెల్లి సర్పంచ్‌లకు వర్తించే నిబంధనలు కేసీఆర్‌కు వర్తించవా? అని ప్రశ్నించారు. 

No comments:

Post a Comment