Tuesday, 16 September 2014

విభజన ప్రక్రియ పూర్తి కావలసి వుంది: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అధికారులు, సిబ్బంది విభజన జరగాల్సి ఉందని ఆయన చెప్పారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో ఏపీకి నిరంతర విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలోనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబు మీద ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు సమర్థుడు, ఆదర్శప్రాయుడు అన్నారు. ప్రతిపాదించిన 50 రోజుల్లోనే ప్రాజెక్టులను ఓకే చేయించుకున్నారన్నారు. బాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు వెళ్తుందన్నారు.

No comments:

Post a Comment