తాడిపత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి మీద స్టేట్ బ్యాంకు అధికారులు కేసు పెట్టడంతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత బ్యాంకు అధికారులు కేసును వాపసు తీసుకోవడంతో పరిస్థితులు సర్దుమణిగాయి. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం దగ్గర చెత్త విపరీతంగా పేరుకుపోతోందని, దాన్ని శుభ్రం చేయాలని బ్యాంకు అధికారులతో ప్రభాకరరెడ్డి వాగ్వాదానికి దిగారు. దాంతో బ్యాంకు అధికారులు ఆయన మీద కేసు పెట్టారు. తన మీద కేసును నిరసిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్బీఐ బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే ఆందోళనకు మద్దతుగా భారీగా ప్రజలు తరలి వచ్చి బ్యాంకు ముందు చాలాసేపు ధర్నా చేపట్టారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. తాడిపత్రి అట్టుడికిపోయింది. తాను తాడిపత్రి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపడితే బ్యాంకు అధికారులు తన పైన కేసు పెట్టడమేమిటని జేసీ ప్రశ్నించారు. ఎట్టకేలకు బ్యాంకు అధికారులు జేసీ ప్రభాకరరెడ్డి మీద కేసు ఉపసంహరిచుకోవడంతో వివాదం సర్దుమణిగింది.
No comments:
Post a Comment