మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మహారాష్ట్రలో 288 శాసనసభా స్థానాలకు, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషనర్ (సిఈసి) వీఎస్ సంపత్ వెల్లడించారు.
శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన ఎన్నికల షెడ్యూల్ను వివరించారు. ఈ నెల 20న రెండు రాష్ట్రాల్లోనూ నోటిఫికేషన్ వెలువడుతుందని, నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 27 చివరి తేదీ అని చెప్పారు. అక్టోబర్ 15న రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరుగుతుందని, 19న ఓట్ల లెక్కింపు ఉంటుందని సంపత్ వివరించారు.
'నోటా' సౌకర్యంతో పాటు ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు గట్టి భద్రత ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని సంపత్ చెప్పారు. వరదల కారణంగా అక్కడ ఎన్నికలు నిర్వహించలేని స్థితి ఉందని తెలిపారు.
No comments:
Post a Comment