Sunday 16 November 2014

హైదరాబాద్ లో సల్మాన్ చెల్లి పెళ్లికి 2 కోట్లు..తరలి వస్తున్న బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చెల్లె పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నుమాలో ఈనెల 18న జరిగే వేడుక కోసం సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలి రానున్నారు. 
సల్మాన్ చెల్లెలు అర్పిత వ్యాపార వేత్త ఆయుష్ శర్మ ఈనెల 18న ఒక్కటౌతున్నారు. ఈ వివాహ వేడుక కోసం సల్మాన్ అక్షరాలా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట.
చారిత్రక ఫలక్ నుమా నిజాం ప్యాలెస్ ను చెల్లి పెళ్లి కోసం ఈనెల 17,18,19 తేదీలను సల్మాన్ ఖాన్ ఇప్పటికే బుక్ చేశారు. ఈ హోటళ్లో 60 గదులున్నాయి. 
ఈ వేడుకకు రావాల్సిందిగా సల్మాన్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. అయితే ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి రాలేనని చెప్పారు. అలాగే సోనియాగాంధీని ఆహ్వానించినా కుదరదని చెప్పేసింది. ఇదిలా ఉంటే...బాలీవుడ్ స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యేందుకు తరలిరానున్నారు. హృతిక్ రోషన్, కత్రినా కైఫ్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకునే, సైఫ్ అలీఖాన్, హేమమాలిని, ధర్మేంద్ర, కరణ్ జోహార్ తో పాటు చాలామంది బాలీవుడ్ తారలు హైదరాబాద్ కు తరలి రానున్నారు. 
ఇక టాలీవుడ్ కి చెందిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాంచరణ్, రాణాతో పాటు మరికొంతమందికి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. 
ఈ వేడుక జరిగే మూడు రోజులు సందర్శకులను ఈ హోటల్ కు అనుమతించరు. వేడుక జరిగే ఆ మూడు రోజులు ప్రభుత్వ బందోబస్తుతో పాటు సల్మాన్ ప్రైవేట్ సెక్యూరిటీ కనుసన్నల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. 

No comments:

Post a Comment