Sunday 16 November 2014

ఇంటిని ఖాళీ చేయాలని నాకు నోటీసిస్తారా?.. అన్యాయం: చిరంజీవి ప్రశ్న

chiranjeevi
ఢిల్లీలో తాను నివాసముంటున్న ఇంటిని ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చెందిన కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూ) అధికారులు తనకు నోటీసు ఇవ్వడం పట్ల కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నోటీసు అంశంపై ఆయన మాట్లాడుతూ ఇది చాలా అన్యాయమన్నారు. ఖాళీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే, తనకు ప్రత్యామ్నాయ నివాసం చూపకుండా ఇప్పుడే ఖాళీ చేయమని నోటీసు ఇవ్వడం సరికాదన్నారు. 
 
తన పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త నివాసం కేటాయించాలని కోరానని, అప్పుడు స్పందించని అధికారులు.. ఇపుడు ఉరుకులు పరుగుల మీద ఇల్లు ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికైన మించి పోయిందేమీ లేదనీ తనకు సరైన ఇంటిని చూపిస్తే తక్షణం ఖాళీ చేస్తానని చిరంజీవి తెలిపారు.
 
కాగా, చిరంజీవి ఢిల్లీలో ప్రస్తుతం ఉంటున్న అధికారిక ప్రభుత్వ బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలంటూ గురువారం కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ) నోటీసు అంటించిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment