హైదరాబాద్: కరీంనగర్ శివారులో ఉన్న హౌజింగ్బోర్డు కాలనీ ఓ ఇంట్లో ఆదివారం ఉదయం 6 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల శరీర భాగాలు మాంసం ముద్దలుగా మారాయి. ఈ పేలుడు సంఘటనలో కర్నూలు జిల్లా వెలుగోడు మండల కేంద్రానికి చెందిన పట్నం నాగార్జున కుమార్ (34), మ ల్లు రామకృష్ణారెడ్డి (60)లు దుర్మరణం చెందగా పట్నం శ్రీనివాస్కుమార్ (26)కు తీవ్రగా యా లతో పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరబాద్కు తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం పట్నం నాగార్జున కుమార్, శ్రీనివాస్ కుమార్ సోదరులు 12 సంవత్సరాల నుంచి కరీంనగర్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో దేవతలు, ఇతర బొమ్మలు తయారు చేసి విక్రయిస్తుంటారు. వీరి వద్ద వంట మనిషిగా అదే గ్రామానికి చెందిన మల్లు రామకృష్ణారెడ్డి పని చేస్తున్నాడు. ఇంట్లోని రెండు గదులను గోదాంగా చేసి అక్కడే బొమ్మల తయారీకి ఉపయోగించే రసాయనాలు నిల్వ ఉంచుతారు. అయితే శనివారం మద్యాహ్నం వీరు నివాసముంటున్న ఇంటి ఆవరణలో పేలుడు జరిగింది. గడువు ముగిసిన హార్డినరీ రసాయనంపై ఒత్తిడి కారణంగానే అది పేలిందని పోలీసులు భావిస్తున్నారు.
No comments:
Post a Comment