తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు తేదేపా, కాంగ్రెస్లకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు అధికార తెరాసలో చేరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం కాంగ్రెస్కు చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ఈ రోజు తెరాస గూటికి చేరుతున్నారు. ఆయనతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా భారీగా తెరాసలో చేరుతుండడంతో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ కనుమరుగైంది.
ఇదిలా ఉంటే తెరాసలో చేరేందుకు కాంగ్రెస్కే చెందిన మాజీ మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తెరాస మంత్రి జగదీశ్వర్రెడ్డి, హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఆయన ప్రస్తుతానికి మౌనంగా ఉన్నా కొద్ది రోజుల్లో తెరాసలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే తోలుకుంట్ల ప్రకాష్గౌడ్ కూడా తెరాసలో చేరతారన్న వార్తలు వస్తున్నాయి. ఆయనతో జిల్లాకు చెందిన మంత్రి మహీధర్రెడ్డి మంతనాలు జరుపుతున్నారట.
No comments:
Post a Comment