Saturday, 13 September 2014

కేసీఆర్‌కు మీడియా కష్టాలు : త్రిసభ్య కమిటీ రెడీ..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మీడియా కష్టాలు తీరేలా లేవు. మీడియాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలాదూరం వెళ్తున్నాయి. ఇప్పటికే జాతీయ మీడియా కేసీఆర్‌పై గుర్రుగా ఉన్న తరుణంలో.. కేసీఆర్ వ్యాఖ్యలపై విచారణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) త్రి సభ్య కమిటీ వేసింది.  
 
మీడియా వాళ్ళ మెడలు విరగ్గడొతానని, పది కిలోమీటర్ల లోతున పాతిపెడతానని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగాచర్చనీయాంశమయ్యాయి, దీంతో పీసీఐ ఫైర్ కావడంతో పాటు ఓ త్రిసభ్య కమిటీని వేసి..  ఇందులో సీనియర్ జర్నలిస్టు రాజీవ్ రంజన్‌నాగ్ కన్వీనర్‌గా, కె. అమర్‌నాథ్, కృష్ణప్రసాద్ సభ్యులుగా నియమించింది. 
 
తెలంగాణలో మీడియా ఎదుర్కొంటున్న ముప్పు, బెదిరింపుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫారసు చేయనున్నట్లు పీసీఐ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ తెలిపారు.

No comments:

Post a Comment