Monday 20 October 2014

మళ్లీ పి.టి. ఉష పరుగులు: గుజరాత్ విద్యార్థులకు ట్రైనింగ్

ptushaనాటి పరుగుల రాణి పీటీ ఉష గుజరాత్ లో పిల్లలకు దీర్ఘకాలిక శిక్షణ ఇచ్చేందుకు సమ్మతించినట్లు తెలిసింది. దేశ ప్రధాని నరేంద్రమోడీ కోరిక మేరకే గుజరాత్ లో కొంతమంది బాలలను వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి, వారికి చైనా తరహాలో దీర్ఘకాలిక శిక్షణ ఇవ్వడానికి ఉష అంగీకరించినట్లు తెలుస్తోంది.
 
అక్కడ 10 - 11 ఏళ్ల వయసున్న 30 మంది పిల్లలను ఎంపిక చేసి, వారికి ప్రాథమిక శిక్షణ ఇచ్చి. ఆ తర్వాత వాళ్లు ఏయే విభాగాలకు సరిపోతారో అంచనా వేసి ఆ ప్రకారం వాళ్లను తీర్చిదిద్దడం ఈ దీర్ఘకాలిక ప్రణాళిక లక్ష్యం. సియోల్ ఒలింపిక్స్ లో భారత పతాకాన్ని అథ్లెటిక్స్ విభాగంలో పీటీ ఉష రెపరెపలాడించిన విషయం తెలిసిందే. 
 
ఇప్పటికే ఆమె తన ఊరు సమీపంలో ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ ను తెరిచింది. ఇటీవల ఆమె స్కూలు నుంచి వచ్చిన ముగ్గురు బాగా ప్రతిభ చూపారు. యువ క్రీడాకారులను తీర్చిదిద్ది, వారి ప్రతిభకు మెరుగులు దిద్దేందుకు ఆమె తీసుకున్న నిర్ణయం మంచిదేనని క్రీడా వర్గాలు అంటున్నాయి. 

No comments:

Post a Comment