రుణాల కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రుణమాఫీ ఎందుకంటూ పిటిషన్ వేస్తారా? అంటూ పిటిషనర్పై హైకోర్టు ఫైర్ అయ్యింది. భవిష్యత్తులో ఇలా ప్రజల ప్రయోజనాలను కాలరాసే పిటిషన్లు వేస్తే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
రైతు రుణమాఫీపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులే లేకపోతే మనం లేమన్న విషయం గుర్తుంచుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే, సమగ్ర సర్వేపై విచారించిన హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
No comments:
Post a Comment