Tuesday 28 October 2014

'ధూమ్' సినిమా తరహాలో సొరంగం తవ్వి బ్యాంకులో దోపిడీ



హర్యానా రాష్ట్రంలో 'ధూమ్' అనే బాలీవుడ్ చిత్రం తరహాలో ఓ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. ఇందుకోసం దొంగలు ఏకంగా 125 అడుగుల మేర సొరంగం తవ్వడం గమనార్హం. హర్యానాలోని గోహనా టౌన్‌షిప్‌లో సొరంగం తవ్వి ఓ బ్యాంకు స్ట్రాంగ్ రూంకు చేరుకొని డబ్బులు, కోట్లాది రూపాయల నగలు, బంగారం దోచుకున్నారు. దోపీడిని సోమవారం ఉదయం గుర్తించారు. సొరంగం తవ్వి, స్ట్రాంగ్ రూంకు వచ్చినందున.. ఈ దోపిడీ శనివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం మధ్యన జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. 
 
chandigarh mapసదరు దొంగలు స్ట్రాంగ్ రూంలో ఉన్న 360 లాకర్లలోని 90 లాకర్లను దోచుకెళ్లారని బ్యాంకు మేనేజర్ చెప్పారు. పోలీసులు బ్యాంకులోని రెండు గదుల్లో సొరంగం తాలుకు మట్టిని గుర్తించారు. దొంగలు లోనికి వచ్చి అన్ని కిటికీలు మూసేశారు. దీంతో వారు బయటకు కనిపించకుండా పోయారు. తాము సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని గొహానా డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసు సోమవారం చెప్పారు. బ్యాంకు లోపల పలు సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ, స్ట్రాంగ్ రూంలో మాత్రం ఎలాంటి కెమెరాలు లేవని చెప్పారు.

No comments:

Post a Comment