Monday 20 October 2014

బాణసంచా తయారీ కేంద్రంలో బ్లాస్ట్: 13 మంది సజీవ దహనం

తూర్పు గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 13 మంది సజీవదహనమయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
జిల్లాలోని యు. కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం ఈ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. రెండు అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయి. బాణసంచా అనధికారికంగా తయారు చేస్తుండగా ఈ విస్ఫోటనం సంభవించింది. 
 
మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతున్నారు. సంఘటన ప్రాంతం వద్ద, ఆసుపత్రి వద్ద మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పేలుడు ఘటన పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment