Saturday 18 October 2014

అతుల్ శర్మతో మాజీ భార్య లింకట: కూతురికి, పేస్‌కు బెదిరింపులు!

తనను, తన కూతురుని చంపుతానని క్రికెటర్ అతుల్ శర్మ బెదిరించినట్లు టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతుల్ శర్మతో తన మాజీ భార్య రియా పిళ్లైకి సంబంధాలున్నట్లు నిరూపించే సాక్ష్యాధారాలను ఆయన కోర్టుకు సమర్పించారు.
 
బాంద్రా కోర్టు కాంప్లెక్స్‌లో తనను, తన కూతురుని చంపుతానని అతుల్ శర్మ బెదిరించినట్లు పేస్ తెలిపారు. లియాండర్ పేస్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్టోబర్ 10వ తేదీన అతుల్ శర్మ తనను బెదిరించినట్లు ఆయన ఫిర్యాదులో పేస్ తెలిపారు.
 
ఇక అతుల్ శర్మపై కేసు నమోదు చేశామని, అరెస్టు మాత్రం చేయలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఆఫీసర్ కెవి నిగాడే చెప్పారు. కాగా.. పేస్ తనపై గృహ హింసకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ రియా పిళ్లై కేసు పెట్టారు.

No comments:

Post a Comment