హైదరాబాద్కి చెందిన నాలుగేళ్ళ బాలుడు సాయివర్మను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశాడు. హైదరాబాద్లోని చింతల్ ప్రాంతానికి చెందిన కోమలాదేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిని పరామర్శించడానికి తన కుమారుడు నిషాంత్ సాయివర్మను తీసుకుని ఈనెల 11వ తేదీన ఖమ్మం వెళ్ళింది. కోమలాదేవి ఆస్పత్రిలో వున్నప్పుడు సాయివర్మ కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి బాలుడి కోసం తల్లిదండ్రులు వెతుకుతూనే వున్నారు. పోలీసు కంప్లయింట్ కూడా ఇచ్చారు. ఆదివారం నాడు ఖమ్మం శివారులోని రఘునాథపాలెం మండలం బలాపేట ప్రాంతంలోని పొదల్లో కుళ్ళిపోయిన స్థితిలో సాయివర్మ మృతదేహం కనిపించింది. హంతకులెవరు, హత్యకు గల కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు.
No comments:
Post a Comment