Sunday 14 September 2014

భార్య గొంతు కోసిన భర్త

అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యను కడతేర్చిన భర్త ఉదంతమిది. భార్యపై అనుమానం పెంచుకున్న ప్రబుద్ధుడు శనివారం అర్ధరాత్రి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. కృష్ణా జిల్లా బందరు మండలం కరగ్రహారం గ్రామంలో ఈ దారుణం జరిగింది. జొన్నలవారిమోడి గ్రామానికి చెందిన బొల్లా నాగేశ్వరరావు, కరగ్రహారం గ్రామానికి చెందిన భూలక్ష్మికి పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. కొన్ని నెలలుగా వీరు కరగ్రహారం గ్రామంలో నివశిస్తున్నారు. పెళ్ళయిన నాటి నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉండటం, భూలక్ష్మిపై నాగేశ్వరరావుకు అనుమానం ఉండటంతో వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో నాగేశ్వరరావు కొబ్బరికాయలు నరికే కత్తితో భూలక్ష్మి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. బందరు తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment