Sunday 21 September 2014

మహబూబ్ నగర్ జిల్లాలో వెల్దండ మండలం గుండాల వద్ద మాజీ మావోయిస్టు యాదయ్యపై దుండగులు దాడి చేసి హత మార్చారు.

మహబూబ్ నగర్: జిల్లాలో వెల్దండ మండలం గుండాల వద్ద మాజీ మావోయిస్టు యాదయ్యపై దుండగులు దాడి చేసి హత మార్చారు. స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. ఘటనకు సంబంధించిన వివరాలిలావున్నాయి.. యాదయ్య అలియాస్ శ్యామ్ బైక్ పై వెళ్తున్నాడు. కారులో వచ్చిన గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు.. వెల్దండ మండలం గుండాల వద్ద అతన్ని అడ్డగించి కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన యాదయ్యను చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అయితే మావోయిస్టుగా పని చేసిన యాదయ్య గతంలో లొంగిపోయాడు. గత కొంతకాలంగా పలు సెటిల్ మెంట్లు చేసేవాడని తెలుస్తోంది. సెటిల్ మెంట్ల చేసే క్రమంలో ఎమైనా తగాదాలు రావడంతో ఎవరైనా ఈ హత్యకు పాల్పడి ఉంటారా..అని పలువురు భావిస్తున్నారు. మరోవైపు కల్వకుర్తికి చెందిన మాజీ మావోయిస్టు రమాకాంత్, అచ్చంపేటకు చెందిన మాజీ మావోయిస్టు శ్రీను కూడా గతంలో హత్యకు గురయ్యారు. తాజాగా యాదయ్య హత్య జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హత్య వెనుకాల నయింముఠా హస్తం ఉందా..అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

No comments:

Post a Comment