దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బదౌన్ గ్యాంగ్ రేప్, హత్య కేసు మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా భావిస్తున్న నిందితుడికి నిర్వహించిన సత్యశోధన పరీక్ష విఫలమైంది. దీంతో ఈ సాక్ష్యం కోర్టులో చెల్లదని సీబీఐ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కేసులో ప్రధానసాక్షి అయిన నజ్రూకు ఇటీవల పాలీగ్రాఫిక్ పరీక్ష నిర్వహించారు. పరీక్ష నివేదిక ఈరోజు తమకు అందిందని సీబీఐ తెలిపింది. అయితే నజ్రూ చెప్పిన సాక్ష్యానికి, పరీక్షలో వచ్చిన ఫలితానికి పొంతన లేదని సీబీఐ అధికారులు చెపుతున్నారు. నజ్రూ చెప్పిన సాక్ష్యం ఆధారంగానే యూపీ పోలీసులు కేసు నమోదు చేసి, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
యూపీలోని బదౌన్లో అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం చేసి, అనంతరం వారిని చెట్టుకు ఉరేసి హత్య చేసినట్టు ఆరోపణలు రావడంతో సంచలనం రేగింది. అయితే బాలికలపై అత్యాచారం జరగలేదని డీఎన్ఏ పరీక్షలో తేలింది.
No comments:
Post a Comment