న్యూఢిల్లీ: తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆపై అత్యాచారం చేశాడని మాజీ ప్రియుడు, పిహెచ్డీ విద్యార్దిపై ఓ కాంట్రాక్ట్ లెక్చరర్ శాటిలైట్ ఏరియా పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అహ్మాదాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... అహ్మాదాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బాధితురాలు కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేసింది. పీహెచ్డీ చేసేందుకు సందీప్ కృష్ణన్ అదే ఐఐఎంలో చేరాడు. వీరిద్దరి మధ్య చనువు కాస్త పెరిగి , అది ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకుంటానని చెప్పి బాధితురాలిని నమ్మించి.. శారీరకంగా అనుభవించాడు. ఆ తర్వాత సందీప్ కృష్ణన్ ఉద్యోగం నిమిత్తం ఢిల్లీకి చేరుకున్నాడు. బాధితురాలు కూడా తన కాంట్రాక్ట్ ముగియడంతో బెంగుళూరుకి చేరుకుంది. ఇటీవల సందీప్కు మరో మహిళతో వివాహం అయినట్లు తెలుసుకున్న బాధితురాలు తాను మోసపోయానని భావించి పోలీసులను ఆశ్రయించింది. దీంతో సందీప్ కృష్ణన్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
No comments:
Post a Comment