టాలీవుడ్ సక్సెస్ డైరక్టర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన శ్రీను వైట్ల.. ఇపుడు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. మహేష్ బాబు హీరోగా తన దర్శకత్వంలో వచ్చిన 'ఆగడు' చిత్రానికి డివైడ్ టాక్ వచ్చిన విషయం తెల్సిందే. దీంతో శ్రీను వైట్ల - రామ్ చరణ్ ప్రాజెక్టుపై నీలి మేఘాలు కప్పుకున్నాయి.
వాస్తవానికి శ్రీను వైట్ల తన తదుపరి చిత్రాన్ని షెడ్యూల్ ప్రకారం రామ్ చరణ్తో చేయాల్సివుంది. అందుకోసం కథను కూడా ఎప్పుడో ఓకే చేసుకున్నాడు. అయితే, ఈ ప్రాజక్టుపై ఇప్పుడు నీలిమేఘాలు కమ్ముకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
దీనికి కారణం, దర్శకుడు శ్రీను తాజాగా రూపొందించిన 'ఆగడు' సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించకపోవడమే! ఈ చిత్రానికి మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. మహేష్, శ్రీనుల నుంచి భారీ అంచనాలతో రూపొందించారు. అయితే, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో డీలా పడ్డారు.
ఇక, సినిమా ఇండస్ట్రీలో బంధాలన్నీ సక్సెస్ పైనే ఆధారపడివుంటాయనేది కఠోర వాస్తవం. హిట్టిస్తే వెంటనే ఆ దర్శకుడితో సినిమా చేస్తారు. లేదంటే ఒప్పుకున్న చిత్రాన్ని కూడా డ్రాప్ చేసుకుంటారు. మరి, ఈ ప్రభావం రామ్ చరణ్పై కూడా ఉంటుందా? లేక ఇలాంటి వాటికి అతీతంగా ఇచ్చిన మాట ప్రకారం సినిమా చేస్తాడా? అన్నది చూడాలి!
No comments:
Post a Comment