హైదరాబాద్:జర్నలిస్టుల సంఘం నాయకులమంటూ వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ విలేకరులను హైదరాబాద్ సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు అరెస్టు చేశారు. ఓ దినపత్రిక మాజీ విలేకరి, హయత్నగర్ చెందిన సూర్యప్రకాశ్ చారి మరో ముగ్గురితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.తెలంగాణా జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పాటు చేసి విద్యాసంస్థలు..ఫార్మాకంపెనీల నుంచి తమ సంఘం సమావేశానికి డబ్బు కావాలంటూ వేధిస్తున్నారు. ముఠా అరాచకాలు పెరగడంతో బాధితుల ఫిర్యాదుతో పోలీసులు సూర్యప్రకాశ్తో పాటు జగదీష్ విపిన్ కుమార్, కేసరి ప్రవీణ్ రెడ్డి, మనోహర్లను అరెస్టు చేశారు.
No comments:
Post a Comment