Friday 19 September 2014

గాయపడ్డ ఎమ్మెల్యేకి హరీష్ రావు పరామర్శ

అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు పరామర్శించారు. కుక్కునూరులో టిడిపి ఎమ్.పి మాగంటి బాబు, ఆయన అనుచరులకు, తాటి వెంకటేశ్వర్లుకు మద్య జరిగిన ఘర్షణలో ఈయన గాయపడ్డారు.దీనిపై హరీష్ రావు ఈ ఘటనను ఖండించి , తాటి వెంకటేశ్వర్లును పరామర్శించారు.దాడి ఎందుకు జరిగిందన్నదానిపై కారణాలు అడిగి తెలుసుకున్నారు.కాగా ఈ దాడికి కారకుడైన ఏలూరు ఎమ్.పి మాగంటి బాబును అరెస్టు చేయాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు.అశ్వరావుపేట నియోజకవర్గ ప్రజలు నీకేమైనా ఓటు వేశారా అని మాగంటి బాబు ను గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యే దాడిపై తెలంగాణ గిరిజన ఎమ్మెల్యేలు, ఆ రాష్ట్రా సీఎం, గవర్నర్ ను కలవనున్నారని చెప్పారు.

No comments:

Post a Comment