టిడిపి నేత రేవంత్ రెడ్డివి అర్థంలేని ఆరోపణలని ఆయన తన ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చాలని చూస్తున్నారని టిఆర్ఎస్ శాసనసభ్యుడు జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వేలకోట్ల రూపాయల భూములు టిడిపి హయాంలో ధారాదత్తం చేసినా నోరుమెదపని రేవంత్ ఇప్పుడు మెట్రోపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో శ్రీవరు భూముల్ని కొల్లగొట్టారన్న అంశంపై బహిరంగ విచారణకు తాము సిద్ధమని అన్నారు. .
No comments:
Post a Comment