Friday 19 September 2014

ఆస్తి కోసం కన్న కూతుర్నే నరికి చంపేసిన కసాయి తల్లి!

ఆస్తి కోసం తన కన్నకూతుర్నే ఓ కసాయి తల్లి నరికి చంపేసింది. ఈ దారుణ ఘటన నగరంలోని యూసుఫ్‌గూడ లక్ష్మీనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

స్థానికంగా నివాసం ఉండే కళ్యాణి(25)ను ఆమె కన్నతల్లి లక్ష్మి(50) కత్తితో నరికి చంపడమే కాక.. శవం పక్కనే కత్తి పట్టుకుని నిలబడింది.
 
దీంతో ఆమెను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. లక్ష్మికి ముగ్గురు కుమార్తెలు. అంతా కలిసి లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నారు. తల్లీ కూతుళ్ల మధ్య కొంత కాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి.

No comments:

Post a Comment