Wednesday 17 September 2014

ఎత్తుకెళ్లి ఆరుగురు ఆరు రోజుల పాటు రేప్, ట్విస్ట్‌లు

ఎత్తుకెళ్లి ఆరుగురు ఆరు రోజుల పాటు రేప్, ట్విస్ట్‌లువారణాసి/చాందౌలీ: 17 ఏళ్ల యువతిని అపహరించిన ఆరుగురు దుండగులు, ఆమె పైన ఆరు రోజుల పాటు అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. పదిహేడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, ఆమె పైన ఆరుగురు అత్యాచారం చేశారని పోలీసులు బుధవారం తెలిపారు. ఈ సంఘటన సెప్టెంబర్ 9వ తేదీన జరిగిందన్నారు. చందౌలీ జిల్లాలోని ఇలియా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సెప్టెంబర్ 9వ తేదీన బాధిత బాలిక తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఆరుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు. వారు 

ఆరుగురు ఆమెను బలవంతంగా తాము వెళ్తున్న కారులోకి లాక్కున్నారని, అనంతరం ఆమెను అలహాబాద్ తీసుకు వెళ్లి బంధించారని, అక్కడే ఆరు రోజుల పాటు అత్యాచారం చేశారని పోలీసులు చెప్పారు. అనంతరం ఆమెను వారణాసికి తీసుకు వచ్చి కాన్ట్ రైల్వే స్టేషన్ వద్ద వదిలివేశారని తెలిపారు. మలుపులు! అప్పటికే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నిందితుల్లో ఒకరు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. మీ కూతురును రైల్వే స్టేషన్లో చూశామని సమాచారం అందించాడు. వెంటనే అక్కడకు వెళ్లిన వారికి కూతురు కనిపించింది. పోలీసులు సోమవారం రాత్రి ఆరుగురి పైన కేసు నమోదు చేశారు. మరోవైపు, బాధిత బాలిక మంగళవారం వైద్య పరీక్షలకు వెళ్లేందుకు నిరాకరించింది. ఆరుగురు నిందితులు కూడా పరారీలో ఉన్నారు.

No comments:

Post a Comment