జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తాడికొండ మండలం కంతేరు సమీపంలో ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తాడికొండ- కంతేరు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక అమరావతి సమీపంలో ఎద్దువాగు, నరుకుళ్లపాడువాగు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అమరావతి- గుంటూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది.
No comments:
Post a Comment