Friday 19 September 2014

దాడి కేసు : ఎంపీ మాగంటి బాబు అరెస్టుకు వైకాపా డిమాండ్!

ఖమ్మం జిల్లా అశ్వారావు పేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర రావుపై దాడి చేసిన ఏలూరు ఎంపీ మాగంటి బాబును వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన శుక్రవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ మాగంటి బాబు ఆయన గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
 
అశ్వరావుపేట నియోజకవర్గ ప్రజలు నీకేమైనా ఓటు వేశారా అని మాగంటి బాబు ను గట్టు సూటిగా ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యే దాడిపై తెలంగాణ గిరిజన ఎమ్మెల్యేలు, ఆ రాష్ట్రా సీఎం, గవర్నర్ ను కలవనున్నారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే టీడీపీ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోందని గట్టు ఆరోపించారు. 

No comments:

Post a Comment