ఆంధ్రప్రదేశ్ తదుపరి సీఎం నారా చంద్రబాబు తనయుడు నారాలోకేషేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. ముఖ్యమంత్రి కావడానికి నారా లోకేష్కు అన్ని అర్హతలున్నాయని పుల్లారావు కితాబిచ్చారు.
రైతు రుణమాఫీల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీ తదుపరి ముఖ్యమంత్రి నారాలోకేషేనని తెలిపారు.
చంద్రబాబు నాయుడి తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని, అందుకే రైతుల రుణ మాఫీని అమలు చేస్తామని తాము హామీ ఇస్తున్నామని మంత్రి అన్నారు.
ప్రభుత్వం రైతులకు సెక్యూరిటీ బాండ్స్ ఇస్తుందని, వచ్చే 10, 15 ఏళ్లలో రుణాలు తిరిగి చెల్లించడానికి అవసరమైన మార్గాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, రాష్ట్రంలో 20 ఏళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment