Tuesday 23 September 2014

బాబును ఉరితీయాలి: శైలజానాథ్, మోసమెందుకని.

బాబును ఉరితీయాలి: శైలజానాథ్, మోసమెందుకని..అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు, మహిళలను నట్టేట ముంచిన సిఎం చంద్రబాబును చెట్టుకు ఉరి తీయాలని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ శైలజానాథ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి నివాసం నుంచి ఆర్టీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి.. కార్యాలయం ఎదుట రెండు గంటలపాటు బైఠాయించారు. యోగ్యత లేనప్పుడు హామీలు గుప్పించి రైతులను, మహిళలను మోసం చేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా చంద్రబాబును శైలజానాథ్ ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చామని ప్రజల ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పగలవా అని శైలజానాథ్ నిలదీశారు. దివంగత సిఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి ప్రమాణ స్వీకారం రోజునే దాన్ని నెరవేర్చారని గుర్తు చేశారు
బాబును ఉరితీయాలి: శైలజానాథ్, మోసమెందుకని..

No comments:

Post a Comment