Monday 22 September 2014

పవన్ వల్లే చిరుకి మర్యాద?

కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపి చిరంజీవి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి డిల్లీకి విమానాల్లో చక్కర్లు కొట్టడం తప్ప మరేం చేయడం లేదని చిరంజీవి చేసిన విమర్శలపై తెలుగు దేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు దేశం నేత దెందులూరు ఎమ్మెల్యే చింతామణి ప్రభాకర్ ఆదివారం చిరంజీవిపై తారాస్థాయిలో మండిపడ్డారు. చిరంజీవిని ఆంధ్రోలు
ఏనాడో మరిచిపోయారని, అయినా కాస్తో కూస్తో గౌరవం ఇస్తున్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ వల్లనేనని వ్యాఖ్యానించారు.
ఆ కాస్త గౌరవానైనా చిరంజీవి నిలుపుకోవాలని చింతామణి ప్రభాకర్ సూచించారు. ఎన్నికల్లో చిరంజీవిని ఎంతగా ఛీ కొట్టినా బుద్ది రాకపోవడం సిగ్గు పడాల్సిన విషయం అని చెప్పారు. చిరంజీవి ఇప్పటికైనా తన తీరును మార్చుకోవాలని విమర్శించారు.

No comments:

Post a Comment