Wednesday 17 September 2014

కేసీఆర్ దుర్బుద్ధి.. వినాశకాలే విపరీతబుద్ధి: జానారెడ్డి

Jana reddyతెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్ రావుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఆ రాష్ట్ర విపక్ష నేత, కె. జానారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి, వ్యూహాలు వినాశకాలే విపరీతబుద్ధి అనే చందంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఫలితంగానే ఆయన విపక్ష నేతలను సైతం హేళన చేస్తూ కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. 
 
అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే కనకయ్యపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి ఆయన వినతి పత్రం సమర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొందిన పదవిని విడిచిపెట్టకుండా వేరే పార్టీలోకి చేరడం అనైతికమన్నారు. స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి కనకయ్య మీద అనర్హత వేటు వేయాలని కోరారు. 

No comments:

Post a Comment