Thursday 18 September 2014

సవతి మీద వేడి వేడి నూనె పోసిన మహిళ

న్యూఢిల్లీ: ఇద్దరు భార్యల మధ్య గొడవ.. చినికి చినికి గాలివానలాగా మారి చివరకు మొదటి భార్య మీద రెండో భార్య మరిగే నూనె పోసిన సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో జరిగింది. శ్రవణ్ యాదవ్‌ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మొదట భార్య సోనుతో విభేదాలు రావడంతో ఆ తర్వాత ఆర్తి అనే యువతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ ఇండోర్ లోని భగీరథ్ పురా ప్రాంతంలోనే ఉంటారు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరినీ వేరువేరు ఇళ్లలో ఉంచినా వీరిద్దరి మధ్య గొడవలు తగ్గలేదు. బుధవారం ఉదయం ఆర్తి తన తల్లి అనితతో కలిసి సోను ఇంటికి వెళ్లింది. వస్తూ వస్తూనే బాగా మరిగిన నూనెను తీసుకుని ఆమె మీద పోసింది. ఆ సమయంలో సోను కుమార్తె కూడా తల్లితో పాటే ఉండటంతో ఆమెకు కూడా తీవ్రంగా గాయపడింది. దాంతో వారిద్దరినీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. సోను ఆర్తితో పాటు భర్త శ్రవణ్ మీద కేసు పెట్టింది. నిందితులిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు ఐపీసీ 326 సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు. 

No comments:

Post a Comment