Sunday 14 September 2014

నా జన్మదినం జరపొద్దు.. కాశ్మీర్‌ని ఆదుకోండి.. మోడీ..

భారత ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజు ఈనెల 17వ తేదీ. ఆరోజున ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు వేడుకలు జరిపే బదులు భారీ వరదల కారణంగా ఆపదలో ఉన్న జమ్మూకాశ్మీర్ ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేశారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని తన స్నేహితులు, అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామంటూ కోరారని, అయితే తాను వారిని వారించానని చెప్పారు. తన జన్మదిన వేడుకలకు ఖర్చుచేసే మొత్తాన్ని కాశ్మీర్ వరద సహాయంగా అందజేయాలని మోడీ విజ్ఞప్తి చేశారు

No comments:

Post a Comment