ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్. నరసింహన్ సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలో ఆయన ఒకరోజు మాత్రమే ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అవుతారు.
ఈ పర్యటనలో ఆయన రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ ను కలిసిన కొద్దిరోజులకే నరసింహన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అదేసమయంలో తెలంగాణలో టీవీ9, ఏబీన్ ఆంధ్రజ్యోతి ప్రసారాల నిలిపివేత, మీడియాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై కూడా గవర్నర్ వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
No comments:
Post a Comment