Monday 15 September 2014

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపెల్లిలో బోరు నుంచి వేడి నీళ్లు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపెల్లిలో బోరు నుంచి వేడి నీళ్లు వస్తున్నయ్. స్థానిక ఎంపిటిసి స్వామి ఇంట్లో గత యేడాదిన్నర క్రితం బోరు వేశారు. మొదట్లో మామూలుగానే నీళ్లు వచ్చాయి. కానీ గత పదిహేను రోజులుగా బోరు నీళ్లు వేడిగా ఉంటున్నయ్. ప్రతి రోజూ ఇలాగే వేడి నీళ్లు వస్తుండటంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు భయపడుతున్నరు. బోరు మోటారును పరీక్షించామని అయినా ఫలితం లేకుండా పోయిందని ఎంపిటిసి స్వామి అన్నరు. స్థానికుల సలహ మేరకు బోరు వాటర్ ను ల్యాబ్ పరీక్షల నిమిత్తం పంపించారు. అధికారులు పరీక్షించి చెపితేగాని ప్రశాంతంగా ఉండలేమంటున్నరు.

No comments:

Post a Comment