Tuesday 16 September 2014

హైదరాబాద్ మెట్రోకు టీఆర్ఎస్ గ్రహణం

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోకు టీఆర్ఎస్ గ్రణహంగా మారిందని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మెట్రో రైలు పనులకు కేసీఆర్ ప్రభుత్వం అడ్డంకిగా మారిందని ఆయన బుధవారమిక్కడ అన్నారు. మెట్రో అలైన్ మెంట్ మార్చాలని కేసీఆర్ ఒత్తడి తేలేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
 
డిజైన్ విషయంలో ఎల్ అండ్ టీని ఒప్పించలేకపోయారన్నారు. మెట్రో పనులు కొనసాగించలేమని ఎల్ అండ్ టీ లేఖ రాసింది వాస్తవం కాదా అని అన్నారు. ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వమే స్పందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మెట్రో ప్రాజెక్ట్ పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

No comments:

Post a Comment