సూపర్స్టార్ మహేష్బాబు, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటించిన చిత్రం ‘ఆగడు’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000 థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాలుగు భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ వర్గాల వారు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సంస్థ భారీ ఎత్తున థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేస్తోంది.
‘1’(నేనొక్కడినే) చిత్రాన్ని కూడా ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ పంపిణీ చేసిన విషయం తెల్సిందే. అయితే ఆ చిత్రం ఈ సంస్థకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. కాని తాజాగా ‘ఆగడు’ మాత్రం తప్పకుండా ఈరోస్కు సౌత్లో మంచి సక్సెస్ను ఇవ్వగలదని భావిస్తున్నారు. ‘దూకుడు’ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అందుకు తగ్గట్లే దర్శకుడు శ్రీను వైట్ల తనదైన మార్కుతో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ చిత్రం సంగీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై అనీల్ సుంకర, రామ్ ఆచంట, గోపీ ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అందుకు తగ్గట్లే దర్శకుడు శ్రీను వైట్ల తనదైన మార్కుతో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ చిత్రం సంగీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై అనీల్ సుంకర, రామ్ ఆచంట, గోపీ ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
No comments:
Post a Comment