Saturday 13 September 2014

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.5.24 లక్షల పరిహారం: సీపీ ఆనంద్

హైదరాబాద్: దొంగనోట్ల ముఠా చేతిలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.5.24 లక్షల పరిహారాన్ని సీపీ ఆనంద్ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈశ్వరయ్యకు ప్రభుత్వ మిచ్చే రూ.25లక్షల పరిహారం త్వరగా వచ్చేలా చూస్తామని, కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. నగర శివారు ప్రాంతం శామీర్ పేట వద్ద జరిగిన దొంగనోట్ల ముఠా దాడిలో కానిస్టేబుల్ ఈశ్వరయ్య మృతిచెందిన విషయం తెలిసిందే

No comments:

Post a Comment