Tuesday 16 September 2014

మినీబస్సు బీభత్సం: ముగ్గురికి గాయాలు


మినీబస్సు బీభత్సం: ముగ్గురికి గాయాలుహైదరాబాద్: యూసుఫ్ గూడలోని కృష్ణానగర్ బస్తీలో ఓ మినీ బస్సు అదుపు తప్పి వాహనదారులపైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు.  స్థానికులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. 108 క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అదే ప్రమాదంలో నాలుగు కార్లు, 5 బైకులు ధ్వంసమైనాయి. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి... మినీ వ్యాన్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

No comments:

Post a Comment