Tuesday 16 September 2014

రుణమాఫీని అమలు చేస్తాం - మంత్రి ఈటెల..

రుణమాఫీపై బ్యాంకులు సానుకూలంగా స్పందించాయని, రుణమాఫీని అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష రూపాయల లోపు  రైతు రుణాలను మాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. బ్యాంకులు ఒప్పుకోని పక్షంలో రైతులకే నేరుగా బాండ్లు కానీ, చెక్కులను కానీ అందజేస్తామని ఈటెల రాజేందర్ తెలిపారు.  

No comments:

Post a Comment